Webdunia - Bharat's app for daily news and videos

Install App

మతిమరుపు మాయం కావాలంటే.. ఆకుకూరలు తినాలట..

Written By సందీప్
Updated: శనివారం, 1 జూన్ 2019 (11:51 IST)
వయసు పెరిగే కొద్దీ మెదడు చురుకుదనం తగ్గిపోతుంది. ఆలోచనా శక్తి, తెలివితేటలు కూడా మందగిస్తాయి. ఆవకాడో, కోడిగుడ్లు, ఆకుకూరలను ఎక్కువగా తీసుకుంటే మెదడు చురుగ్గా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మతిమరుపును దూరం చేసుకోవాలన్నా, మెదడు పనితీరును మెరుగుపరుచుకోవాలన్నా డైట్‌లో తప్పకుండా ఆకుకూరలను చేర్చుకోవాలని వారు సూచిస్తున్నారు. 
 
మతిమరుపు సమస్యలు ఉత్పన్నం కాకముందే జాగ్రత్తపడటానికి ల్యూటెన్ సమృద్ధిగా ఉండే ఆకుకూరలు, ఆవకాడో, కోడిగుడ్లు ఎక్కువగా తీసుకోవాలి. ఇవి తింటే మెదడు, శరీరం రెండూ చురుగ్గా పని చేస్తాయి. పలు పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. అలాగే బ్లూ బెర్రీస్‌లో ఫ్లెవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. మతిమరుపు కలగకుండా అడ్డుకునే ఫోటోకెమికల్స్ వీటిలో ఉంటాయి. 
 
ఆకుకూరలు, ఆవకాడో, కోడిగుడ్లతో పాటు క్యాలీఫ్లవర్, మొలకెత్తిన విత్తనాలు, ఆరెంజ్, ద్రాక్ష పండ్లు తీసుకోవడం మంచిది. మెదడుకు రక్తప్రసరణ సరిగ్గా జరగాలన్నా, జ్ఞాపకశక్తి పెరగాలన్నా తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. అంతేకాకుండా సాల్మన్ ఫిష్‌లో ఒమేగా త్రి ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. మెదడును యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా మార్చడంలో ఉపయోగపడతాయి. మానసిక ఆందోళనను దూరం చేయడంలో కూడా ఇవి తోడ్పడతాయి.

అన్నీ చూడండి

నేపాల్ జలప్రళయం : ఆ ఒక్క ఇల్లు మాత్రం ఎలా నిలిచింది?

అయ్యా.. నా భార్య ఆసుపత్రిలో వుంది, బైక్‌ను వదిలేయండి: పోలీసులను వేడుకున్న డెలివరీ రైడర్, వీడియో

Tirumala: అలిపిరి ఘాట్ రోడ్డు వద్ద దొరికిన బ్యాగ్.. అందులో ఏముందంటే?

Jagtial: బస్సు నడుపుతుండగా ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. తర్వాత ఏమైందంటే?

రూ. 18 లక్షల బైక్‌పై వస్తుండగా రోడ్డు ప్రమాదం: ప్రముఖ యూట్యూబర్, బైక్ రైడర్ అషు మృతి

అన్నీ చూడండి

మాస్ మహారాజా రవితేజ ఇరుముడి సెన్సేషనల్ రన్..150 కోట్లు దాటిన గ్రాస్

మమితా బైజు మలయాళ చిత్రం ‘బెత్లెహెం కుడుంబ యూనిట్’ తెలుగులో రాబోతోంది

కార్తీక్ గరిమెల్ల తెరకెక్కిస్తున్న ముగ్గురు కోతులు టైటిల్ సాంగ్ రిలీజ్

Balakrishna: కుర్చీలోనే బాలక్రిష్ణకు రక్షాబంధన్ కట్టిన తోబుట్టువులు

Kittu Pavan: తెలంగాణా ఫోక్‌ స్టార్‌ కిట్టు పవన్‌ హీరోగా చిత్రం ప్రారంభమైంది

తర్వాతి కథనం
Show comments