మతిమరుపు మాయం కావాలంటే.. ఆకుకూరలు తినాలట..

శనివారం, 1 జూన్ 2019 (11:50 IST)
వయసు పెరిగే కొద్దీ మెదడు చురుకుదనం తగ్గిపోతుంది. ఆలోచనా శక్తి, తెలివితేటలు కూడా మందగిస్తాయి. ఆవకాడో, కోడిగుడ్లు, ఆకుకూరలను ఎక్కువగా తీసుకుంటే మెదడు చురుగ్గా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మతిమరుపును దూరం చేసుకోవాలన్నా, మెదడు పనితీరును మెరుగుపరుచుకోవాలన్నా డైట్‌లో తప్పకుండా ఆకుకూరలను చేర్చుకోవాలని వారు సూచిస్తున్నారు. 
 
మతిమరుపు సమస్యలు ఉత్పన్నం కాకముందే జాగ్రత్తపడటానికి ల్యూటెన్ సమృద్ధిగా ఉండే ఆకుకూరలు, ఆవకాడో, కోడిగుడ్లు ఎక్కువగా తీసుకోవాలి. ఇవి తింటే మెదడు, శరీరం రెండూ చురుగ్గా పని చేస్తాయి. పలు పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. అలాగే బ్లూ బెర్రీస్‌లో ఫ్లెవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. మతిమరుపు కలగకుండా అడ్డుకునే ఫోటోకెమికల్స్ వీటిలో ఉంటాయి. 
 
ఆకుకూరలు, ఆవకాడో, కోడిగుడ్లతో పాటు క్యాలీఫ్లవర్, మొలకెత్తిన విత్తనాలు, ఆరెంజ్, ద్రాక్ష పండ్లు తీసుకోవడం మంచిది. మెదడుకు రక్తప్రసరణ సరిగ్గా జరగాలన్నా, జ్ఞాపకశక్తి పెరగాలన్నా తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. అంతేకాకుండా సాల్మన్ ఫిష్‌లో ఒమేగా త్రి ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. మెదడును యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా మార్చడంలో ఉపయోగపడతాయి. మానసిక ఆందోళనను దూరం చేయడంలో కూడా ఇవి తోడ్పడతాయి.

అన్నీ చూడండి

కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లిన మహిళను మింగేసిన మొసలి

ఒక్క స్కూల్ కూల్చితే పది పాఠశాలలు నిర్మిస్తా : అక్బరుద్దీన్ ఓవైసీ

వీడిన మృతదేహం మిస్టరీ : తోడుగా తీసుకెళ్లిన స్నేహితుడే చంపేశాడు...

ప్రేమించి దూరం పెట్టిందని టెక్కీని హత్య చేసిన ముగ్గురు పిల్లల తండ్రి!

కాలి నడకన తిరుమలకు 116 యేళ్ల వృద్ధురాలు.. 6న వీఐపీ బ్రేక్ దర్శనం

అన్నీ చూడండి

అడిగి తీసుకుంటే భిక్ష - అడగకుండా ఇస్తే అసలైన విలువ : రాజేంద్ర ప్రసాద్

SS Rajamouli: వారణాసి అప్ డేట్ తో ఎం.ఎం. కీరవాణి పుట్టినరోజు వేడుక

Narne Nithin :నార్నే నితిన్, అనికా సురేంద్రన్, మేఘా శెట్టి కాంబినేషన్ లో చిత్రం

Akhil: లెనిన్ కథకు అఖిల్ సూట్ అవుతాడా? అని భయపడ్డాను, కానీ చూశాక హిట్ నమ్మకం కలిగింది : నాగార్జున

మరోమారు పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్

తర్వాతి కథనం
Show comments