మామిడి పండ్లను ఇలా తింటే వేడి చేయదట?

బుధవారం, 22 మే 2019 (13:06 IST)
వేసవి వచ్చిందంటే చాలు మామిడి పండ్ల ప్రియులకు పండుగే. నోరూరించే ఈ ఫలరాజులో పోషకాలు బోలెడన్ని ఉంటాయనే సంగతి అందరికీ తెలిసిందే. ఓ వైపు మామిడి పండ్లు నోరూరిస్తున్నప్పటికీ... వేడి చేస్తుందని భయపడి చాలా మంది మామిడి పండ్లు తినడానికి వెనుకంజ వేస్తూంటారు. 
 
కానీ రోజుకు ఒకటి లేదా రెండు మామిడి పండ్లను తినడం ద్వారా వేసవి తాపం నుండి తప్పించుకోవచ్చని న్యూట్రిషనిస్టులు చెప్తున్నారు. మామిడి పండ్లలో క్యుర్సెటిన్, ఫిసెటిన్, ఐసోక్యూరెసిట్రిన్, ఆస్ట్రాగాలిన్, గాలిక్ యాసిడ్, మిథైల్ గాలెట్ వంటి పలు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. 
 
మామిడి పండ్లు వేసవిలోని వేడిమి కారణంగా సహజంగా ఏర్పడే అలసట, డీహైడ్రేషన్ వంటి సమస్యలను తగ్గిస్తాయి. ఆహారాన్ని మితంగా తీసుకోవాలనుకునేవాళ్లు మామిడి పండ్లు తింటే త్వరగా ఆకలేయదనీ, కడుపు నిండిన భావన కలుగుతుందని కూడా న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. ముక్కలుగా కోసి మిక్సీలో వేసుకొని స్మూతీగానూ మామిడి రుచులను ఆస్వాదించవచ్చు.
 
మామిడి పండ్లను తినడం వల్ల శరీరానికి వెంటనే శక్తి అందడంతో రోజంతా ఉత్సాహంగా ఉంటారు. వీటిలో విటమిన్ ఎ, ఐరన్, కాపర్, పొటాషియం అధిక మోతాదుల్లో ఉంటాయి. మామిడి పండులో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. వీటిని ఉదయం, సాయంత్రం వేళల్లో తినడం వల్ల శరీరంలో కేలరీలు పేరుకుపోకుండా ఉంటాయి.
 
మామిడి పండ్లు తింటే బరువును పెరుగుతామనీ, వేడి చేస్తుందనీ చాలా మంది భావిస్తారు... కానీ రోజుకు ఒకటి లేదా రెండు మామిడి పండ్లను బేషుగ్గా లాగించేస్తే ఎలాంటి ఇబ్బందీ ఉండదంటున్నారు. మామిడి పండులో ఉండే చక్కెరలు, పీచు శరీరానికి మేలు చేస్తాయి. అప్పటికీ వేడి చేస్తుందనే భయం ఇంకా మీ మనసులో ఉంటే రాత్రి పడుకునే ముందు మామిడి పండ్లను నీళ్లల్లో వేసి.. ఉదయాన్నే తినండి. ఇలా చేయడం వల్ల అస్సలు వేడి చేయదు.

అన్నీ చూడండి

హైదరాబాద్‌లో ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్ కార్యకలాపాల విస్తరణ

ఆంధ్రప్రదేశ్‌లో రుణ వితరణ: రూ.393.17 కోట్ల రుణాలను మంజూరు చేసిన కెనరా బ్యాంక్, రూ. 36.85 లక్షల సీఎస్ఆర్ సాయం

వందేమాతరాన్ని అవమానిస్తే మూడేళ్ల జైలుశిక్ష : కేంద్రం

నెలకు ఇంటి అద్దె రూ.80 వేలు.. అయినా క్యాబ్ డ్రైవర్

నిలకడగా వాంగ్‌చుక్ ఆరోగ్యం... కాక్రోచ్ మార్చ్‌ను విజయవంతం చేయాలంటూ పిలుపు

అన్నీ చూడండి

'రామాయణం' చిత్రం కాదు.. భారత్‌ను ప్రపంచానికి పరిచయం చేస్తే ప్రయాణం : రకుల్ ప్రీత్ సింగ్

అవకాశాల కోసం దిగజారను : కాజల్ అగర్వాల్

72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో రెండు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్న బ్రహ్మయుగం

New Delhi: 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల విజేతల ప్రకటన వెలువడింది

L.B. Sriram: ఆలస్యంగా గుర్తించినందుకు అవమానంగా ఉంది : ఎల్. బి. శ్రీరామ్

తర్వాతి కథనం
Show comments