పగటిపూట నిద్రమత్తు వీడాలంటే.. పచ్చిమామిడి తినండి..

పగటిపూట నిద్రమత్తు వీడట్లేదా? మధ్యాహ్నం పూట భోజనం చేశాక.. నిద్రమత్తులో జోగుతున్నారా? అయితే పచ్చిమామిడి కాయలను మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత తింటే నిద్రమత్తు వదిలిపోతుంది. ఇలా చేయడం ద్వారా చురుకుగా పనిచ

మంగళవారం, 3 ఏప్రియల్ 2018 (11:15 IST)
పగటిపూట నిద్రమత్తు వీడట్లేదా? మధ్యాహ్నం పూట భోజనం చేశాక.. నిద్రమత్తులో జోగుతున్నారా? అయితే పచ్చిమామిడి కాయలను మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత తింటే నిద్రమత్తు వదిలిపోతుంది. ఇలా చేయడం ద్వారా చురుకుగా పనిచేస్తారు. శరీరానికి కావలసిన శక్తి అందుతుంది. పచ్చిమామిడి తీసుకోవడం ద్వారా కాలేయాన్ని శుభ్రం చేసుకోవచ్చు. 
 
చిన్నపేగుల్లో వున్న పైత్య రసాలు బాగా విడుదలవుతాయి. తద్వారా కొవ్వు తొలగిపోతాయి. పేగులు, జీర్ణాశయాల్లో వుండే వైరస్, బ్యాక్టీరియాలు నశిస్తాయి. వేసవిలో లభ్యమయ్యే మామిడి కాయలను తీసుకోవడం ద్వారా.. డీహైడ్రేషన్ దూరమవుతుంది. ఇది వేడిని తగ్గిస్తుంది. శరీరంలో కీలక మినరల్స్‌ను శరీరం నుంచి బయటకు పోకుండా కాపాడుతుంది. 
 
పచ్చిమామిడిని తినడం లేదా జ్యూస్‌ను తీసుకుంటే జీర్ణాశయ సమస్యలు నయం అవుతాయి. డయేరియా, అజీర్తికి చెక్ పెట్టవచ్చు. పచ్చిమామిడి పండ్లలో నియాసిస్ అధికంగా వుంటుంది. తద్వారా గుండె జబ్బులు దూరమవుతాయి. అలాగే అందరినీ వేధించే ఒబిసిటీ సమస్యను పచ్చిమామిడి దూరం చేస్తుంది. పచ్చిమామిడిని తినడం ద్వారా చిగుళ్లు, దంతాలు దృఢంగా మారుతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

అన్నీ చూడండి

ఏఐ-ఆధారిత పర్యాటక రాష్ట్రంగా అవతరించనున్న ఏపీ.. మంత్రి దుర్గేష్

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఎన్నిక చెల్లదు : కోర్టుకెక్కిన డీఎంకే నేత

అమెరికాలో రోడ్డు ప్రమాదం - తెలుగు విద్యార్థిని మృతి

ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి జనరల్ వార్డులో వర్షపు నీరు (వీడియో)

ఓడిన కన్నప్రేమ - కుమార్తె కాళ్లపై పడినా కనికరించలేదు... (వీడియో)

అన్నీ చూడండి

Victory Venkatesh :అనిల్ రావిపూడి చిత్రం షూటింగ్‌లో జాయిన్ అయిన విక్టరీ వెంకటేష్

Chiru158: హైదరాబాద్‌లో శమెగాస్టార్ చిరంజీవి 158 చిత్రం భారీ యాక్షన్ షెడ్యూల్

మిస్టరీ, సస్పెన్స్ తో వ్యూ: ది పాయింట్ ఆఫ్ వ్యూ టీజర్

Ntr: ఎన్టీఆర్‌కు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో విబేదం ఏమిటి ?

Nagabandham collections :నాగబంధం కలెక్షన్స్ కు దర్శక నిర్మాతలు తిప్పలు !

తర్వాతి కథనం
Show comments