Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెడ్‌వైన్ తాగుతున్నారా... అది దెబ్బతినడం ఖాయం...

అనేకమంది మద్యంబాబులు ఇష్టపడే మద్యం రెడ్‌వైన్. దీన్ని మహిళలు కూడా కూడా విపరీతంగా తాగుతున్నారు. శరీరానికి ఏమాత్రం హాని చేయదన్నది వారి అభిప్రాయం. అయితే, రెడ్‌వైన్ తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు ఉత్పన్న

Written By pnr
Updated: సోమవారం, 13 ఆగస్టు 2018 (13:40 IST)
అనేకమంది మద్యంబాబులు ఇష్టపడే మద్యం రెడ్‌వైన్. దీన్ని మహిళలు కూడా కూడా విపరీతంగా తాగుతున్నారు. శరీరానికి ఏమాత్రం హాని చేయదన్నది వారి అభిప్రాయం. అయితే, రెడ్‌వైన్ తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని పరిశోధకులు చెబుతున్నారు.
 
అధిక మోతాదులో రెడ్‌‌వైన్‌ తీసుకోవడం వల్ల కేన్సర్‌, హృద్రోగంతో పాటు డిప్రెషన్‌కు లోనయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా శుద్ధిచేయని, చక్కెర శాతం ఎక్కువగా ఉన్న ద్రాక్షరసం తాగటం వల్ల కాలేయం దెబ్బతింటుందని తెలిపారు. ఈ పరిణామాల వల్ల శరీరంలోని చెడు కొవ్వు శాతం పెరుగుతుందని కూడా వారు హెచ్చరిస్తున్నారు.
 
ఈ రెడ్‌వైన్‌ను రోజూ తాగడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులతో పాటు చర్మ సంబంధ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందట. దీనికి కారణం ఈ వైన్‌లో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుందని, దీనివల్ల ముఖంపై మొటిమలు వస్తాయని, చర్మం కళ కోల్పోతుందని వైద్యులు చెబుతున్నారు. అలాగే, కళ్లకింద నల్లటి వలయాలు కూడా ఏర్పడతాయని పేర్కొన్నారు. ఈ సమస్యలకు దూరంగా ఉండాలంటే సాధ్యమైనంత వరకు రెడ్‌ వైన్‌ను తాగకపోవడమే మంచిదని పరిశోధకులు సూచనలిస్తున్నారు. 
About Author
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... Read More

అన్నీ చూడండి

నా జీవితాన్ని ప్రధాని మోడీ నరకం చేశారు : రుచికా సింగ్ (వీడియో)

అత్యాచారాన్ని ప్రతిఘటించిన నర్సు ... చంపేసిన కామాంధుడు

మత్తు రహిత సమాజం కోసం యువత ప్రతినబూనాలి : ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు

గదిలో ఏకాంతంగా ప్రియుడితో దొరికిన భార్య.. ప్రియుడితో కలిసి గొంతు నులిమి భర్త హత్య

ఉపాధ్యాయుడి సమయస్ఫూర్తి - నిలిచిన 1643 మంది చిన్నారుల ప్రాణాలు

అన్నీ చూడండి

రెండో వారంలోనూ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న రవితేజ 'ఇరుముడి'

'టాక్సిక్' సాహసోపేతమైన ప్రయోగం : రిషబ్ శెట్టి

మాస్ మహారాజా రవితేజ ఇరుముడి సెన్సేషనల్ రన్..150 కోట్లు దాటిన గ్రాస్

మమితా బైజు మలయాళ చిత్రం ‘బెత్లెహెం కుడుంబ యూనిట్’ తెలుగులో రాబోతోంది

కార్తీక్ గరిమెల్ల తెరకెక్కిస్తున్న ముగ్గురు కోతులు టైటిల్ సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments