ఒత్తిడిని దూరం చేయాలంటే.. చేపలు, పుట్టగొడుగులు తినాల్సిందేనా?

ఒత్తిడిని దూరం చేసుకోవాలంటే.. ముడిధాన్యాలు, సీ ఫుడ్స్ అధికంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మటన్, చికెన్‌ను కూడా ఆహారంలో భాగం చేసుకోవాలని వారు చెప్తున్నారు. విటమిన్‌-డి లోపం వల్ల మానసిక

ఆదివారం, 16 సెప్టెంబరు 2018 (11:07 IST)
ఒత్తిడిని దూరం చేసుకోవాలంటే.. ముడిధాన్యాలు, సీ ఫుడ్స్ అధికంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మటన్, చికెన్‌ను కూడా ఆహారంలో భాగం చేసుకోవాలని వారు చెప్తున్నారు. విటమిన్‌-డి లోపం వల్ల మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. అందుకే ఉదయం ఎండలో తిరగడం లేదా చేపలూ పుట్టగొడుగులూ తినటం చేయాలని వారు సూచిస్తున్నారు. 
 
వీటితో పాటు ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా వున్న ఆహారమైన చేపలు, అవిసె, బాదం, పిస్తా, వాల్‌నట్స్‌ తీసుకోవాలి. విటమిన్‌-ఎ, సి, ఇ లు శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లు. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటం ద్వారా మెదడు కణాలను రక్షిస్తాయి. కాబట్టి ఇవి సమృద్ధిగా ఉండే పండ్లూ కూరగాయల్ని తినడం వల్ల ఒత్తిడిపరమైన సమస్యలన్నీ తగ్గుతాయి. 
 
ముడిధాన్యం, పాలు, గుడ్లు, చేపలతోపాటు ఆకుకూరలూ పండ్లూ బీన్స్‌ వంటివి తీసుకుంటే.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఇంకా ఒత్తిడిని ఇవి దూరం చేస్తాయని ఆరోగ్య నిపుణులు సెలవిస్తున్నారు. 

అన్నీ చూడండి

ఇస్రో శాస్త్రవేత్తలు ఎందుకు రాజీనామాలు చేస్తున్నారు : కేంద్రం ఆరా

ప్రధాని చేతుల మీదుగా తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభం, ఏమిటి దీని ప్రత్యేకతలు?

బెంగాల్‌లో ఘోరం : స్కూలు వ్యానును ఢీకొట్టిన ప్యాసింజర్ రైలు

గల్లా జయదేవ్ గారూ క్షమించండి, మీకోసం ఏపీ తలుపులు తెరిచి వుంచాము: నారా లోకేష్

ప్రేమ విఫలం, ఆత్మహత్య చేసుకున్న యువతి మృతదేహానికి తాళి కట్టమంటూ ప్రియుడి ఇంటి ముందు బైఠాయింపు

అన్నీ చూడండి

Khan Durrani :ఆకట్టుకున్న కళ్యాణం కమనీయం జీవితం సినిమా టీజర్

Varun Tej: కొరియన్ కనకరాజు లో దక్షా నాగర్కర్‌, వరుణ్ తేజ్ లపై స్పెషల్ సాంగ్

Kiran Abbavaram : తత్వం లోని పాట విడుదల చేసిన కిరణ్‌ అబ్బవరం

ముగ్గురు స్నేహితుల కథగా MRP – నీకెంత నాకెంత మూవీ రివ్యూ

Aishwarya Rajesh: హీరోయిన్ కి మూడేళ్ళ స్పాన్ అనే వారు. అదే నిజం అనుకున్నా : ఐశ్వర్య రాజేష్

తర్వాతి కథనం
Show comments