పాలను కలిపిన టీని సేవిస్తున్నారా?

తేయాకు మంచిదే. అందుకే రోజుకు రెండు కప్పుల టీ తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తేయాకులోని యాంటీ-యాక్సిడెంట్లు శరీరానికి ఉత్తేజాన్నిస్తుంది. అలాగే టీని సేవించడంతో పాటు గ్రీన్ టీని కూడా సేవించడం ద

గురువారం, 14 జూన్ 2018 (11:54 IST)
తేయాకు మంచిదే. అందుకే రోజుకు రెండు కప్పుల టీ తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తేయాకులోని యాంటీ-యాక్సిడెంట్లు శరీరానికి ఉత్తేజాన్నిస్తుంది. అలాగే టీని సేవించడంతో పాటు గ్రీన్ టీని కూడా సేవించడం ద్వారా అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. తేయాకులోని పాలీఫినాల్స్‌, అమైనో ఆమ్లాలు, విటమిన్ల కారణంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను దూరం చేసుకోవచ్చు. 
 
తేయాకు క్యాన్సర్‌కు దివ్యౌషధంగా పనిచేస్తుంది. తేయాకులోని యాంటీ యాక్సిడెంట్లు రక్తనాళాల్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది. రోజుకు రెండు లేదా మూడు కప్పుల టీని తీసుకుంటే క్యాన్సర్‌ను నిరోధించవచ్చు. అయితే తేయాకులో పాలను కలుపుకుని తీసుకోకుండా.. తేయాకును నీటిలో మరిగించి తీసుకోవడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
 
టీలో పాలను చేర్చడం వల్ల పాలలోని ప్రోటీన్లు టీలో యాంటీ-యాక్సిడెంట్లను చుట్టేస్తాయి. దీంతో పాలను చేర్చిన టీ నిరూపయోగం అవుతుంది. అందుకే పాలు లేకుండా తేయాకుతో టీ తయారు చేసుకోవాలి. అదీ సన్నని సెగపై కాచితే మరీ మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

అన్నీ చూడండి

వియత్నానం పడవ ప్రమాద మృతులను స్వస్థలాలకు తరలించండి : ఏపీ సీఎం చంద్రబాబు

కర్నాటక రవాణా శాఖామంత్రికి షాకిచ్చిన కండక్టర్

ముద్దుల్లో ఏకంగా ప్రపంచ రికార్డును నెలకొల్పిన బ్రెజిల్ ప్రేమజంట

నాన్న, నాన్నమ్మ ప్రవర్తన నచ్చలేదు.. అందుకే చనిపోతున్నా... విద్యార్థిని ఆత్మహత్య

హర్మూజ్‌ జలసంధిని మూసివేసిన ఇరాన్...

అన్నీ చూడండి

జానకమ్మ గారి మరణవార్త నా హృదయాన్ని ఎంతో కలచివేసింది: మెగాస్టార్ చిరంజీవి

Pawan Kalyan surgery: పవన్ కళ్యాణ్ కి మూడున్నర గంటలపాటు శస్త్ర చికిత్స

అఖిల్ హిట్టు కొట్టాడు అని అందరూ అంటుంటే ఆనందంగా ఉంది

Ramya Krishna : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లక్ష్మి ప్రణతి పాత్రలో రమ్యకృష్ణ

ఏడుగురు మహిళల జీవితాల చుట్టూ తిరిగే ఈ కథ తో హ్యాపీ జర్నీ

తర్వాతి కథనం
Show comments