Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో పర్యాటక ప్రాంతాలకు వెళ్తున్నారా? ఐతే ఐస్ ముక్కల్ని?

వేసవిలో పర్యాటక ప్రాంతాలకు వెళ్తున్నారా? హాయిగా వుందామని చల్లని ప్రాంతాలను వెతుక్కుంటూ వెళ్తున్నారా? అయితే ట్రిప్పుకొచ్చి.. ఆహారంపై దృష్టి పెట్టడం మానేశారంటే అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకున్నట్లేనని వ

Written By Kowsalya
Updated: సోమవారం, 23 ఏప్రియల్ 2018 (13:12 IST)
వేసవిలో పర్యాటక ప్రాంతాలకు వెళ్తున్నారా? హాయిగా వుందామని చల్లని ప్రాంతాలను వెతుక్కుంటూ వెళ్తున్నారా? అయితే ట్రిప్పుకొచ్చి.. ఆహారంపై దృష్టి పెట్టడం మానేశారంటే అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకున్నట్లేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పర్యాటక ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఆహారంపై పెద్దగా దృష్టి పెట్టరు. ఏదో దొరికిన ఆహారాన్ని తీసుకోవడం.. అలాగే రుచిగా వుండే ఆహార పదార్థాలను లాగించేయడం చేస్తుంటారు. 
 
అంతేగాకుండా.. దారిలో కనిపించే పదార్థాలన్నీ రుచిచేస్తుంటారు. కానీ పర్యాటక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మసాలా లాంటి వేడిచేసే పదార్థాలను ఎక్కువగా తీసుకోకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. శరీరానికి చలవ చేసే ఆహారాన్నే తీసుకోవాలని.. ముఖ్యంగా వేసవిలో శరీరానికి మేలు చేసే ఆహార పదార్థాల్లే డైట్‌లో చేర్చుకోవాలని వారు సూచిస్తున్నారు. 
 
అలాగే పర్యాటక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఎక్కువగా నీరు తాగాలి. నిమ్మరసం బాటిల్ బ్యాగులో పెట్టుకోవాలి. కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు తీసుకుంటూ వుండాలి. చల్లగా ఉంటుందని ఎక్కువగా పానీయాల్లో ఐస్ ముక్కలు వేసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని గమనించండి.
 
అలాగే మసాలా దినుసులు, కారపు ఆహార పదార్థాలను పక్కనబెట్టాలి. వీలైనంత వరకు మితమైన కారం, ఉప్పు వుండే ఆహార పదార్థాలను డైట్‌లో చేర్చుకుంటే వేసవిలో ఆరోగ్యానికి మేలు చేసిన వారవుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

అన్నీ చూడండి

శంషాబాద్‌ ఎయిర్ పోర్టులో ఏడు కిలోల వెండి నాణేలు స్వాధీనం

రూ.700 అప్పు చెల్లించడంపై వివాదం : మధ్యలో కల్పించుకున్న వ్యక్తి దారుణ హత్య

శ్మశానవాటికలో ఆరు నెలల వయసున్న శిశువు మృతదేహం అదృశ్యం

వైద్య, నర్సింగ్ కళాశాలల్లో కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి

అమెరికా వీసా అనేది హక్కు కాదట - 1.75 లక్షల వీసాలు రద్దు చేయనున్న అమెరికా

అన్నీ చూడండి

దుల్కర్ సల్మాన్.. ఐ యామ్ గేమ్ నుంచి ఎవరే నువ్వే గీతం విడుదల

Shyam Prasad Reddy: అగధ లో కామాక్షి ని చూస్తే అరుంధతి లో అనుష్క ను గుర్తుచేసింది : శ్యాం ప్రసాద్ రెడ్డి

రాకేష్ వర్రే, మధుమిత సర్కార్ పై మాయలేడి చెంగు చెంగున దూకెరా.. సాంగ్

జ్యోతి పూర్వజ్ కిల్లర్ చిత్రం తెలుగు, తమిళ సహా పలు దేశాల్లో విడుదల.

Manchu Manoj :ఇండస్ట్రీకి కులం, గోత్రం లేదు : గజ టీజర్ లాంచ్ లో మంచు మనోజ్

తర్వాతి కథనం
Show comments