నిలబడి నీళ్ళు తాగితే ఏమవుతుందో తెలుసా? (Video)

"పరుగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం మిన్న" అని మన పెద్దలు అపుడపుడూ చెబుతుంటారు. కానీ, నిలబడి నీళ్లు తాగడం కూడా ప్రమాదేనంటున్నారు ఆయుర్వేద శాస్త్రవేత్తలు. మనిషి మనుగడ సాగించాలంటే నీళ్లు తప్

గురువారం, 19 జులై 2018 (13:15 IST)
"పరుగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం మిన్న" అని మన పెద్దలు అపుడపుడూ చెబుతుంటారు. కానీ, నిలబడి నీళ్లు తాగడం కూడా ప్రమాదేనంటున్నారు ఆయుర్వేద శాస్త్రవేత్తలు. మనిషి మనుగడ సాగించాలంటే నీళ్లు తప్పనిసరి. దాహం వేసినపుడల్లా నీరు తాగాల్సిందే. అయితే, ఆ నీరు తాగే పద్ధతిలో తాగితేనే ఆరోగ్యానికి మంచిదని, ఎలా పడితే అలా తాగితే రోగాల బారినపడే అవకాశాలున్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
 
* సాధారణంగా మనిషి శరీరంలో 60 శాతం నీళ్లే ఉంటాయి. అయితే, రోజువారి దినచర్యల వల్ల ఈ నీటి శాతం క్రమంగా తగ్గిపోతుంది. ఆ సమయంలో నీళ్లు తాగాలన్న సందేశాన్ని మెదడు అందిస్తుంది. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా గటగటా నీరు తాగేస్తాం. 
 
* అలా నీరు తాగే సమయంలో మనం కూర్చొని ఉన్నామా? నిలుచొని ఉన్నామా? అనేది పట్టించుకోం. అయితే, నిల్చొని నీళ్లు తాగడం వల్ల రోగాల బారిన పడతామని, కూర్చొని తాగితేనే ఆరోగ్యానికి మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
 
* నిల్చుని నీళ్లు తాగడం వల్ల మనం తాగే నీళ్లు ఎక్కువ వేగంతో అన్నవాహికలోకి వెళ్లి, పొత్తి కడుపులో భాగంలో బలంగా తాకుతుందట. పలు సందర్భాల్లో అలాగే తాగుతూ ఉంటే పొత్తి కడుపు గాయాలపాలై, పక్కనున్న అవయవాలు కూడా ప్రభావితమవుతాయట. 
 
* భవిష్యత్తులో జీర్ణ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా, కిడ్నీ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. 
 
* ముఖ్యంగా, నిలబడి తాగడం వల్ల నీళ్లు అతి వేగంగా కిడ్నీల గుండా వెళ్తాయి. వడపోత సరిగా జరగదు. దాంతో మలినాలు రక్తంలో కలిసి రోగాలకు దారి తీస్తుందనీ, కిడ్నీల పనితీరు కూడా చెడిపోతుందని వారు వివరిస్తున్నారు. 
 
* మరీముఖ్యంగా కీళ్ల వద్ద ఉండే ద్రవాలు సంతులనం కోల్పోతాయని, దాంతో కీళ్లవాతం వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అందుకే వీలైనంత మేరకు కూర్చొని నీళ్లుతాగాని వారు సలహా ఇస్తున్నారు. 

అన్నీ చూడండి

డ్రోన్ దాడులు జరిగితే ఏంటి? షెడ్యూల్ ప్రకారం పని ముగించిన నారా లోకేష్

కె.అన్నామలై 'ఉయ్ ద లీడర్స్' ఉద్యమానికి భారీ స్పందన - 24 గంటల్లోనే 14 లక్షల మంది సపోర్టు

భూ వివాదం.. వేట కొడవళ్లతో మహిళపై దాడి..ఎక్కడ?

గోదావరి పుష్కర ఘాట్‌కు దేవాన్ష్ పేరా? మంత్రి నారా లోకేశ్ ఫైర్

గొడ్డలి పార్టీ ఆగడాలు శృతిమించితే వదిలిపెట్టబోం : సీఎం చంద్రబాబు హెచ్చరిక

అన్నీ చూడండి

Ram 23: రామ్ పోతినేని 23 చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా తిరు ఖరారు

రెండు రోజుల్లో పెద్ది ప్రపంచవ్యాప్తంగా రూ.181.8 కోట్లు కలెక్షన్స్

బాలన్ - ది బాయ్ ట్రైలర్ రిలీజ్ చేసి అభినందించిన అజయ్ దేవగణ్, సూర్య, నాగచైతన్య, రాజ్ బి శెట్టి

Nag Ashwin: పుష్పక విమానం, మహానటి లా నిజాయితీగా సింగ్ గీతం చిత్రం తీశా : నాగ్ అశ్విన్

Warner Bros: వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ నుంచి వస్తోన్న ది ఎండ్ ఆఫ్ ఓక్ స్ట్రీట్

తర్వాతి కథనం
Show comments