Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిలబడి నీళ్ళు తాగితే ఏమవుతుందో తెలుసా? (Video)

"పరుగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం మిన్న" అని మన పెద్దలు అపుడపుడూ చెబుతుంటారు. కానీ, నిలబడి నీళ్లు తాగడం కూడా ప్రమాదేనంటున్నారు ఆయుర్వేద శాస్త్రవేత్తలు. మనిషి మనుగడ సాగించాలంటే నీళ్లు తప్

Written By pnr
Updated: శుక్రవారం, 20 జులై 2018 (18:01 IST)
"పరుగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం మిన్న" అని మన పెద్దలు అపుడపుడూ చెబుతుంటారు. కానీ, నిలబడి నీళ్లు తాగడం కూడా ప్రమాదేనంటున్నారు ఆయుర్వేద శాస్త్రవేత్తలు. మనిషి మనుగడ సాగించాలంటే నీళ్లు తప్పనిసరి. దాహం వేసినపుడల్లా నీరు తాగాల్సిందే. అయితే, ఆ నీరు తాగే పద్ధతిలో తాగితేనే ఆరోగ్యానికి మంచిదని, ఎలా పడితే అలా తాగితే రోగాల బారినపడే అవకాశాలున్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
 
* సాధారణంగా మనిషి శరీరంలో 60 శాతం నీళ్లే ఉంటాయి. అయితే, రోజువారి దినచర్యల వల్ల ఈ నీటి శాతం క్రమంగా తగ్గిపోతుంది. ఆ సమయంలో నీళ్లు తాగాలన్న సందేశాన్ని మెదడు అందిస్తుంది. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా గటగటా నీరు తాగేస్తాం. 
 
* అలా నీరు తాగే సమయంలో మనం కూర్చొని ఉన్నామా? నిలుచొని ఉన్నామా? అనేది పట్టించుకోం. అయితే, నిల్చొని నీళ్లు తాగడం వల్ల రోగాల బారిన పడతామని, కూర్చొని తాగితేనే ఆరోగ్యానికి మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
 
* నిల్చుని నీళ్లు తాగడం వల్ల మనం తాగే నీళ్లు ఎక్కువ వేగంతో అన్నవాహికలోకి వెళ్లి, పొత్తి కడుపులో భాగంలో బలంగా తాకుతుందట. పలు సందర్భాల్లో అలాగే తాగుతూ ఉంటే పొత్తి కడుపు గాయాలపాలై, పక్కనున్న అవయవాలు కూడా ప్రభావితమవుతాయట. 
 
* భవిష్యత్తులో జీర్ణ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా, కిడ్నీ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. 
 
* ముఖ్యంగా, నిలబడి తాగడం వల్ల నీళ్లు అతి వేగంగా కిడ్నీల గుండా వెళ్తాయి. వడపోత సరిగా జరగదు. దాంతో మలినాలు రక్తంలో కలిసి రోగాలకు దారి తీస్తుందనీ, కిడ్నీల పనితీరు కూడా చెడిపోతుందని వారు వివరిస్తున్నారు. 
 
* మరీముఖ్యంగా కీళ్ల వద్ద ఉండే ద్రవాలు సంతులనం కోల్పోతాయని, దాంతో కీళ్లవాతం వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అందుకే వీలైనంత మేరకు కూర్చొని నీళ్లుతాగాని వారు సలహా ఇస్తున్నారు. 
About Author
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... Read More

అన్నీ చూడండి

ఫిట్నెస్ సీక్రెట్‌ను వెల్లడించిన రాహుల్ గాంధీ

అద్దెకు బాయ్‌ ఫ్రెండ్‌ ప్రకటనలపై హైదరాబాద్ సీపీ స్ట్రాంగ్ వార్నింగ్

నకిలీ గుర్తింపు కార్డుతో 25 వివాహాలు చేసుకున్న బీజేపీ ఎమ్మెల్యే అల్లుడు

ఆరిజోనాలో ప్రియురాలి హత్య : జర్మనీలో ప్రియుడి అరెస్టు

మెడికో ప్రియాంక కేసు.. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు : హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

ఎక్కువ మంది స్టార్లు ఉన్న చిత్రాల్లో నటించేందుకు జంకుతాను : నయనతార

మానసిక ప్రశాంతత కోసం సోషల్ మీడియా గుడ్‌బై... 'ప్రేమలు' బ్యూటీ వెల్లడి

'వారణాసి' నుంచి కీలక అప్‌డేట్ - 'రుద్ర' ఫస్ట్‌లుక్ రిలీజ్

Toxic: trailer: బోల్డ్, రా, వైల్డ్, క్రేజీ, అంశాలతో యష్..కియారా అద్వానీ చిత్రం టాక్సిక్: ట్రైలర్

Allari Naresh: కీలక సన్నివేశాల చిత్రీకరణలో రంభ ఊర్వశి మేనక

తర్వాతి కథనం
Show comments