కరోనా వైరస్‌ను అడ్డుకునేందుకు దగ్గు మాత్రలు

గురువారం, 14 మే 2020 (17:18 IST)
తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు తుంపర్లు గాలిలో వేగంగా ప్రయాణించడం వల్ల కరోనా వ్యాప్తి చెందుతోంది. దీనిని అరికట్టడం కోసం ఆరు అడుగుల భౌతిక దూరం పాటించడం మరియు మాస్క్‌లు ధరించడం వంటి ఆంక్షలు అమలు చేస్తున్నారు. అయితే ఇది అన్ని వేళలా సాధ్యం కాకపోవచ్చు. బస్సులు, రైళ్లలో ప్రయాణించేటప్పుడు, మార్కెట్‌లు, పరిశ్రమలు వంటి పలుచోట్ల ఇది అస్సలు సాధ్యం కాదు. 
 
అమెరికా పరిశోధకులు దీనికి పరిష్కారాన్ని కనిపెట్టే పనిలో ఉన్నారు. కొత్త రకం దగ్గుబిళ్లను తయారు చేస్తున్నారు. ఇది నోట్లో వేసుకుంటే లాలాజలం బరువు పెరుగుతుందట, మరియు సులభంగా అతుక్కునే గుణం దీనికి ఉంటుంది. అప్పుడు తుమ్మినా, దగ్గినా, లాలాజలం తుంపర్లు ఎక్కువ దూరం ప్రయాణించకుండా బరువుకి పడిపోతాయి. 
 
దీంతో ఈ బిళ్ల వేసుకుని మాస్క్ పెట్టుకుంటే 2 అడుగుల దూరం పాటిస్తే సరిపోతుందని చెబుతున్నారు. హైస్పీడ్ కెమెరాల ద్వారా తుంపర్లు ప్రయాణించే తీరును పరిశీలించి అవి ఎక్కువ దూరం వెళ్లడం లేదని గుర్తించారు.

అన్నీ చూడండి

నాన్న, నాన్నమ్మ ప్రవర్తన నచ్చలేదు.. అందుకే చనిపోతున్నా... విద్యార్థిని ఆత్మహత్య

హర్మూజ్‌ జలసంధిని మూసివేసిన ఇరాన్...

రాజ్‌ కుమార్‌పై పోక్సో కేసు : పోలీసులతో రూ.20 లక్షలకు డీల్?

రావణ్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు - మొబైల్ ఫోను, ల్యాప్‌టాప్‌లో ఏముంది?

జూలై 12, 2026 ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో వాతావరణం ఎలా వుంది?

అన్నీ చూడండి

జానకమ్మ గారి మరణవార్త నా హృదయాన్ని ఎంతో కలచివేసింది: మెగాస్టార్ చిరంజీవి

Pawan Kalyan surgery: పవన్ కళ్యాణ్ కి మూడున్నర గంటలపాటు శస్త్ర చికిత్స

అఖిల్ హిట్టు కొట్టాడు అని అందరూ అంటుంటే ఆనందంగా ఉంది

Ramya Krishna : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లక్ష్మి ప్రణతి పాత్రలో రమ్యకృష్ణ

ఏడుగురు మహిళల జీవితాల చుట్టూ తిరిగే ఈ కథ తో హ్యాపీ జర్నీ

తర్వాతి కథనం
Show comments