ప్రతిరోజూ శొంఠి పొడిని అన్నంలో కలుపుకుని తీసుకుంటే? ఆకలి నివారణకు?

అల్లాన్ని ఎండబెట్టి తయారుచేసే శొంఠి పొడి అనారోగ్యాలన్నింటికి అమృత వైద్యంగా ఉపయోగపడుతుంది. వర్షంలో తడిసినప్పుడు వచ్చే జలుబు, దగ్గు, జ్వరం వంటి వ్యాధులుకు శొంఠి అద్భుతమైన ఔషధం. దీనిలో అజీర్తిని పోగొట్టే

Written By Kowsalya
Updated: సోమవారం, 16 జులై 2018 (09:36 IST)
అల్లాన్ని ఎండబెట్టి తయారుచేసే శొంఠి పొడి అనారోగ్యాలన్నింటికి అమృత వైద్యంగా ఉపయోగపడుతుంది. వర్షంలో తడిసినప్పుడు వచ్చే జలుబు, దగ్గు, జ్వరం వంటి వ్యాధులుకు శొంఠి అద్భుతమైన ఔషధం. దీనిలో అజీర్తిని పోగొట్టే గుణం కూడా ఉంది.
 
ఈ కాలంలో తరచుగా వర్షంలో తడవడం వలన జలుబు, దగ్గు వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. జలుబు చేసినప్పుడు శొంఠి పొడిని నీళ్లలో కలిపి మరగబెట్టి తాగితే ఉపశమనం కలుగుతుంది. అలాగే టీ లేదా కాఫీ లో కూడా ఈ పొడిని కొద్దిగా కలిపినా ప్రయోజనం ఉంటుంది. జలుబు తీవ్రత ఎక్కువగా ఉంటే శొంఠి పొడిలో చిటికెడు బెల్లం ముక్కను కలిపి ప్రతిరోజూ తీసుకుంటే మంచిది. 
 
అలాగే చెంచా శొంఠి పొడిలో చిటికెడు లవంగాల పొడి, ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. కప్పు నీటిలో ఆ మిశ్రమాన్ని వేసి మరగనిచ్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే జలుబును నివారించుటకు సహాయపడుతుంది. వేడి అన్నంలో శొంఠి పొడిలో కాస్త పప్పునూనెను కలిపి ప్రతీ రోజూ మొదటి ముద్దగా తింటే ఆకలి పెరుగుతుంది. అలాగే పరగడుపున నీళ్లల్లో శొంఠి పొడి కలిపి మరగించి అరచెంచా తేనె కలిపి తాగితే కొలెస్ట్రాల్‌ తగ్గడమే కాకుండా బరువు అదుపులో ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. 
 
ఈ పొడిని వేడి పాలలో వేసుకుని చిటికెడు చక్కెర కూడా కలిపి తాగితే మూత్రాశయానికి సంబంధించిన వ్యాధులు రాకుండా ఉంటాయి. శొంఠి పొడిని నీళ్లల్లో కలిపి పేస్టులా చేసుకుని నుదుటికి రాసుకుంటే తలనొప్పి తగ్గుతుంది.
About Author
Kowsalya

అన్నీ చూడండి

July 25, 2026: జూలై 25, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుంది?

ఈ ప్రొటెస్ట్‌కి పోయేకాలం దగ్గర పడ్డది, జంతర్ మంతర్ నుంచి తెలుగు యువకుడు వీడియో

విద్యార్థులంతా ఆందోళనకు స్వస్తి చెప్పి ఇళ్లకు వెళ్లిపోండి: సల్మాన్ ఖాన్ పిలుపు

Venu Swamy: కాక్రోచ్ జనతా పార్టీతో మోదీకి ఇబ్బందులు తప్పవు.. వేణు స్వామి జోస్యం (video)

విద్యార్థులను శత్రువులుగా చూస్తున్న కేంద్రం : సోనియా గాంధీ

అన్నీ చూడండి

బోరున విలపించిన కోలీవుడ్ నటి : ఎందుకో తెలుసా?

Manchu Lakshmi: సంప్రదాయ బోధనే చిన్నారుల ఎదుగులకు పునాది :మంచు లక్ష్మి

అందుకే బెనాక గోల్డ్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వున్నా : నాగబాబు

పెయిడ్ ప్రీమియర్స్ తో 3.13 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన చెన్నై లవ్ స్టోరీ

వంద దేవుళ్ళు మూవీని స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ప్రకటించిన జీతెలుగు

తర్వాతి కథనం
Show comments