1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
  4. Rush increased in Tirumala

తిరుమల గిరులకు పోటెత్తిన భక్తజనం

rush
పదో తరగతి, ఎంసెట్‌ ఫలితాలు వెలువడడంతో విద్యార్థులు మొక్కులు తీర్చుకోవడానికి తిరుమలకు క్యూకట్టారు. శనివారం ఉదయం కూడా కొండ కిటకిటలాడింది. దీనికి వారాంతపు రద్దీ తోడవడంతో తిరుమలంతా జనమే జనం. దీంతో సర్వదర్శనానికి 20 , దివ్యదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. సర్వ, దివ్యదర్శన క్యూలైన్లు క్యూకాంప్లెక్సులు నిండి నారాయణగిరి ఉద్యానవనంలోకి కిలోమీటర్‌కు పైగా వ్యాపించాయి. 
 
మహాలఘు దర్శనం నిరంతరాయంగా కొనసాగుతున్నా రద్దీ ఏ మాత్రం తగ్గలేదు. ఆలయం ముందు, నాలుగుమాడ వీధులు, అఖిలాండం, లడ్డూ వితరణశాల, నిత్యాన్న సముదాయం, కల్యాణకట్ట భక్తులతో కిక్కిరిశాయి. వచ్చిన వారికి వచ్చినట్లు కేటాయిస్తుండడంతో గదులన్నీ సాయంత్రానికే నిండిపోయాయి. ఆ తర్వాత వచ్చిన భక్తులు వసతి సౌకర్యం లేక ఇబ్బందులు పడ్డారు. ఆదివారం రద్దీ మరింత పెరిగే అవకాశాలున్నాయి. 
About Writer
pyr