ఆదివారం, 29 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : మంగళవారం, 24 మే 2016 (11:10 IST)

హవాయ్ ద్వీపంలో ఒకే రోజు కూలిన రెండు విమానాలు.. ఐదుగురు మృతి

పర్యాటక విమానం కూలి ఐదుగురు చనిపోయారు. ఈ ఘటన అమెరికాలోని హవాయ్ ద్వీపంలో చోటుచేసుకుంది. సెస్నా 182హెచ్ అనే సింగిల్ ఇంజిన్ గల పర్యాటక విమానం కౌయి ద్వీపంలోని హనాపెపే వద్ద టేకాఫ్ అవుతుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగి కూలిపోయింది. 
 
ఈ ప్రమాదంలో పైలట్‌తో సహా ఇద్దరు స్కైడ్రైవింగ్ శిక్షకులు, మరో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఈ ప్రాంతంలో సోమవారం ఒక్కరోజే రెండు విమానాలు ప్రమాదానికి గురికావడం గమనార్హం. ఈ ప్రమాదంపై అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు.