Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాను క్యాష్ చేసుకుంటారా? ఇది సమయం కాదు.. అలీ

Written By సెల్వి
Updated: బుధవారం, 25 మార్చి 2020 (09:05 IST)
Ali
కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో నిత్యావసర ధరలు మండిపోతున్నాయి. కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. చాలామంది వ్యాపారులు, నిత్యావసరాలు, కూరగాయల ధరలను పెంచి... కరోనాను క్యాష్ చేసుకుంటున్నారు. 
 
దీనిపై టాలీవుడ్ హాస్య నటుడు స్పందించాడు. ఇలా రేట్లు పెంచేయడం సరికాదని వ్యాఖ్యానించారు. కరోనా కట్టడి కోసం ఏపీ, టీఎస్ ప్రభుత్వాలకు చెరో లక్ష రూపాయల విరాళం ఇచ్చిన అలీ.. ఇలా ధరలు పెంచేయడం సరికాదన్నారు. ఇది సంపాదించే సమయం కాదని, ఎంత రేటు ఉంటే అంతకే అమ్మాలని వ్యాపారులకు విజ్ఞప్తి చేశారు.
 
దేశం నుంచి కరోనా వెళ్లిపోవాలని కోరుకుంటూ, తాను గత 10 రోజులుగా ఇంట్లోనే నమాజ్ చేస్తున్నానని అలీ వ్యాఖ్యానించారు. ఇటలీలో వ్యాధితో చనిపోయిన వారి మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా ఎవరూ ముందుకు రావడం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని అన్నారు. ప్రజలంతా ప్రభుత్వానికి, పోలీసులకు సహకరించాలని అలీ కోరారు.
 
ఇకపోతే.. తెలుగు రాష్ట్రాల్లో కరోనాపై పోరు జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ అనుమానిత కేసులను గుర్తించి, నమోదు చేయడానికి గాను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక యాప్‌ను ప్రారంభించింది. ఏపీలోనూ కరోనా సోకకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది. 

అన్నీ చూడండి

Allari Naresh: రంభ ఊర్వశి మేనక నుంచి బ్యాడ్ టైం బ్యాండ్ బాజా సాంగ్

Venkatesh : కింగ్డమ్ ఫేమ్ వెంకటేష్.వి.పి. హీరోగా అనౌన్స్ మెంట్

Jyothi Poorvazh: జ్యోతి పూర్వజ్.. కిల్లర్ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ గ్లింప్స్

Venky Atluri :సూర్య గారిని దృష్టిలో ఉంచుకొని కథ రాయలేదు : వెంకీ అట్లూరి

అమీర్ లోగ్ కథ ఇప్పటి వరకు రాలేదు, హిట్టు బొమ్మ.. రమణా రెడ్డి సోమ

తర్వాతి కథనం
Show comments