అమెరికాలో కరోనా రక్కసి విలయతాండవం.. ఒకే రోజు 2వేల మంది మృతి

బుధవారం, 15 ఏప్రియల్ 2020 (11:11 IST)
ప్రాణాంతక వైరస్ కరోనా ద్వారా ఒక్క రోజే అమెరికాలో 2వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్‌తో అమెరికా విలవిలలాడుతోంది. దీంతో రోజు రోజుకీ పాజిటివ్ కేసులు కొత్తగా నమోదవుతూనే.. కరోనా మృతులు కూడా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఒక్కరోజే 2,129 మంది మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 25వేలు దాటింది. 
 
దేశంలో గత 24 గంటల్లో ఆరు లక్షలకు పైగా అమెరికన్లకు కరోనా పాజిటివ్‌ పరీక్షలు నిర్వహించారు. అమెరికాలో కరోనాకు కేంద్రబిందువుగా మారిన న్యూయార్కులో 10,842 మంది మృతి చెందారు. ఇందులో ఒక్కసారి కూడా కరోనా పరీక్షలు చేయించుకోనివారు నాలుగువేల మంది ఉన్నారు. 
 
ఈ వైరస్‌ వల్ల మరో 3778 మంది మరణించే అవకాశం ఉన్నదని ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటివరకు నగరంలో 2,03,020 కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా మొత్తం 25,981 మంది మృతి చెందారు.

అన్నీ చూడండి

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments