Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోమవారం నుంచి ఖతర్, సౌదీ అరేబియా దేశాల మధ్య డైరెక్ట్ విమాన సర్వీసు

Written By ఎం
Updated: ఆదివారం, 10 జనవరి 2021 (10:57 IST)
మూడేళ్ల వివాదానికి తెర దించుతూ ఖతర్, సౌదీ అరేబియా ఇరు దేశాల మధ్య డైరెక్ట్ విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ఈ మేరకు ఖతర్, సౌదీ ఎయిర్‌లైన్స్ ట్విటర్ ద్వారా కీలక ప్రకటన చేశాయి.

సోమవారం నుంచి దోహా, రియాద్ మధ్య డైరెక్ట్ విమాన సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించాయి. జనవరి 14న జెడ్డా నుంచి ఓ విమాన సర్వీసు, దమ్మాం నుంచి జనవరి 16న మరో విమాన సర్వీసు నడుస్తుందని స్పష్టం చేసింది. అది కూడా బోయింగ్ 777-300, బోయింగ్ 787-8, ఎయిర్‌బస్ ఏ350 వంటి పెద్ద విమానాలు నడిపిస్తామని పేర్కొంది.

"సౌదీ అరేబియాలోని మా వాణిజ్య, కార్గో భాగస్వాములతో పాటు దేశంలోని ప్రధాన విమానాశ్రయాలతో తిరిగి బలమైన సంబంధాన్ని ప్రారంభించడానికి మేము ఎదురుచూస్తున్నాము" అని ఖతర్ ఎయిర్లైన్స్ ట్వీట్ చేసింది.

సౌదీ కూడా రియాద్, జెడ్డా నుంచి దోహాకు సోమవారం నుంచి విమాన సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సౌదీ ఎయిర్‌లైన్స్ ట్వీట్ చేసింది. 

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments