ఆ యుద్ధం భారత్ కు లాభమేనా?

మంగళవారం, 10 మార్చి 2020 (07:32 IST)
రష్యా, సౌదీ అరేబియా దేశాల మధ్య చమురు ఉత్పత్తుల విషయంలో విభేదాలు తలెత్తడం వల్ల చమురు ధరలను తగ్గించింది సౌదీ. ఏకంగా 25 శాతానికి పైగా దిగజారాయి. దీని ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లు పతనవైపు ప్రయాణిస్తున్నాయి.

చమురు ధరలు తగ్గటం భారత్కు కలిసొచ్చే అంశమైనా.. వినియోగించుకునే సామర్థ్యం దేశానికి ఉందా అనేది ప్రశ్నగా మిగిలింది. భారత్‌ చేతి చమురు వదులుతోంది.

చమురు రేట్లు పెరిగిన ప్రతిసారీ ఈ మాటలు మనకు వినపడుతుంటాయి. కానీ, చమురు ఉత్పత్తిదారుల మధ్య నెలకొన్న పోటీలో భారత్‌ లబ్ధిదారుగా నిలిచే అవకాశం లభించింది.

వాణిజ్యలోటును తగ్గించుకొనే సువర్ణావకాశం దక్కింది. చమురు ధర పెరిగితే భారత్‌ నష్టపోతుంది.. ధర తగ్గితే లాభపడుతుంది.. అసలే మందగమనంలో ఉన్న సమయంలో దేశంలో వాణిజ్యలోటు పెరగకుండా జాగ్రత్త పడాలి.

ఈ నేపథ్యంలో భారత్‌కు అనుకోని వరంలా అంతర్జాతీయ పరిణమాలు చోటు చేసుకొన్నాయి. ఒపెక్‌+రష్యా మధ్య విభేదాలు పతాక స్థాయికి చేరాయి. ఫలితంగా బ్రెంట్‌ చమురు ధర బ్యారెల్‌కు 33 డాలర్లకు తగ్గడం కలిసొచ్చే అంశంగా మారింది.

అన్నీ చూడండి

Ram 23: రామ్ పోతినేని 23 చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా తిరు ఖరారు

రెండు రోజుల్లో పెద్ది ప్రపంచవ్యాప్తంగా రూ.181.8 కోట్లు కలెక్షన్స్

బాలన్ - ది బాయ్ ట్రైలర్ రిలీజ్ చేసి అభినందించిన అజయ్ దేవగణ్, సూర్య, నాగచైతన్య, రాజ్ బి శెట్టి

Nag Ashwin: పుష్పక విమానం, మహానటి లా నిజాయితీగా సింగ్ గీతం చిత్రం తీశా : నాగ్ అశ్విన్

Warner Bros: వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ నుంచి వస్తోన్న ది ఎండ్ ఆఫ్ ఓక్ స్ట్రీట్

తర్వాతి కథనం
Show comments