పంది మాంసం కాల్చుకుని తింటే ఆ రుచేవేరబ్బా : రష్మిక మందన్నా

బుధవారం, 25 నవంబరు 2020 (10:59 IST)
కన్నడసీమ నుంచి తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టిన హీరోయిన్ రష్మిక మందన్నా (RashmikaMandanna). ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఉన్నారు. అయితే, ఈ అమ్మడు తీసుకునే ఆహార పదార్థాల గురించి తాజాగా వ్యాఖ్యానించింది. 
 
టాలీవుడ్ హీరో రాం చ‌ర‌ణ్ భార్య ఉపాస‌న (Upasana) "యుఆర్ లైఫ్" (URLife) అనే వెబ్ సైట్ ద్వారా ప్రజలకు ఆరోగ్యం గురించి అవగాహణ కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో హీరోయిన్లను తీసుకొచ్చి ఆరోగ్యకరమైన వంట‌లు వండిస్తోంది. ఈ కార్యక్రమం కోసం తాజాగా రష్మిక మందన్నాతో వంటలు చేయించింది. 
 
ఈ సందర్భంగా ఆమెతో రష్మిక మాట్లాడుతూ తన ఆహార అలవాట్లను గురించి చెప్పింది. ‘కోలీ పుట్టు’ అనే కూరను ర‌ష్మిక వండింది. దీంతో ఆమెను ఉపాస‌న ప్రశంసిస్తూ పలు ప్రశ్నలు అడిగింది. మీరు కోర్గి సామాజిక వర్గానికి చెందినవారా? అని, పంది మాంసం అధికంగా తింటారు కదా? అని ప్రశ్నలు వేసింది.
 
దీనికి ఆమె సమాధానమిస్తూ, అవునని చెప్పింది. తాము ఇంట్లోనే వైన్ తయారు చేసుకుంటామని, అలాగే పంది మాంసం తింటామని, ఆ మాంసాన్ని కాల్చుకుని తింటే రుచి అద్భుతంగా ఉంటుందని చెప్పింది. పంది మాంసం, వైన్‌తో రకరకాల వంట‌లు చేసుకుంటామ‌ని తెలిపింది. ఇకపోతే, నిద్ర పోయే ముందుకు రెండు క‌ప్పుల వైన్ తాగితే  హాయిగా నిద్ర ప‌డుతుంద‌ని చెప్పుకొచ్చింది. అంటే, రష్మిక మందన్నా బ్యూటీ సీక్రెట్ ఇదేనన్నమాట. 

అన్నీ చూడండి

పరీక్ష పేపర్ ఇస్తాను.. కోరిక తీర్చు : విద్యార్థినికి అసిస్టెంట్ ప్రొఫెసర్ వేధింపులు

బోరుబావిలో పడిపోయిన మనవడిని రక్షించబోయి ప్రాణాలు కోల్పోయిన తాతయ్య, వీడియో

బంగాళాఖాతంలో అల్ప పీడనం.. తమిళనాడులో విస్తారంగా వర్షాలు

నెల్లూరులో నో, ఆన్‌లైన్‌లో మహానాడు, చంద్రబాబు పొదుపు చర్యలు

తమిళనాడు ఎన్నికల ఫలితాలు చూసి నా చెవుల్లో ఊదరకొట్టేస్తున్నారు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వీడియో

అన్నీ చూడండి

బ్యాడ్ కొలెస్ట్రాల్ వుందా, ఇలా వదిలించుకోవచ్చు

మీ చాయ్‌: ఆంధ్రప్రదేశ్‌లో టీ కల్తీపై అవగాహన కల్పిస్తోన్న టాటా టీ చక్ర గోల్డ్ జెమిని

వాతావరణ మార్పులు, ప్రజల నేత్ర ఆరోగ్యం: తలెత్తుతున్న ఆందోళనలు

మితిమీరి గోధుమ రోటీలను తింటే ఏమవుతుంది?

వేసవిలో డీహైడ్రేషన్‌ రాకుండా వుండాలంటే...?

తర్వాతి కథనం
Show comments