Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2021లో శ్రీశాంత్.. రిజిస్టర్ చేసుకున్న అర్జున్ టెండూల్కర్

Written By సెల్వి
Updated: శనివారం, 6 ఫిబ్రవరి 2021 (10:19 IST)
IPL
కాసుల వర్షం కురిపించే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) టి20 టోర్నీలో వివాదాస్పద భారత క్రికెటర్‌ శ్రీశాంత్‌ మళ్లీ ఆడేందుకు తహతహలాడుతున్నాడు. ఈ సీజన్‌ కోసం నిర్వహించే వేలంలో పాల్గొనేందుకు రూ. 75 లక్షల కనీస ధరతో తన పేరు నమోదు చేసుకున్నాడు. కానీ పోటీ తీవ్రంగా ఉన్న ప్రస్తుత తరుణంలో ఫిక్సింగ్‌ మరకలున్న అతనిపై ఏ ఫ్రాంచైజీ కన్నెత్తి చూస్తోందో వేచి చూడాలి. 
 
అలాగే భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ తనయుడు అర్జున్‌ టెండూల్కర్‌ కూడా ఈ వేలంలో తన పేరు నమోదు చేసుకున్నాడు. అర్జున్‌ రూ. 20 లక్షల కనీస ధరతో పేరును రిజిస్టర్‌ చేసుకున్నాడు. ఈ నెల 18న జరిగే ఆటగాళ్ల వేలానికి భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) రంగం సిద్ధం చేసింది.
 
మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీల్లో కేవలం 61 ఖాళీలే ఉన్న ఈ సీజన్‌ కోసం 1,097 మంది ఆటగాళ్లు వేలంలో పోటీపడుతున్నారు. మిషెల్‌ స్టార్క్, ప్యాటిన్సన్‌ (ఆస్ట్రేలియా), జో రూట్‌ (ఇంగ్లండ్‌)లాంటి అంతర్జాతీయ స్టార్లు ఈ వేలంలో పాల్గొనడం లేదు. వేలం బరిలో 814 మంది భారత ఆటగాళ్లు (21 అంతర్జాతీయ క్రికెటర్లు, 793 అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లు) ఉన్నారు. 283 మంది విదేశీ ఆటగాళ్లు ఫ్రాంచైజీల కంటపడేందుకు బోర్డు వద్ద తమ పేర్లను రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. 

అన్నీ చూడండి

ఆగష్టు 9, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణ సూచన ఎలా వుందంటే..?

ఆ వీడియోలతో బెదిరించి డబుల్ బెడ్రూం ఇంట్లో మహిళపై నలుగురు సామూహిక అత్యాచారం

అద్దెకు బాయ్‌ఫ్రెండ్ సేవలొద్దు.. అమ్మాయిలూ మోసపోతారు.. జర జాగ్రత్త : సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్

నిశ్చితార్థం రద్దు.. రూ.3 కోట్లు డిమాండ్ చేసిన మహిళ.. కేసు నమోదు

Rahul Gandhi, రాహుల్‌జీ మీ పెళ్లెప్పుడు?: GenZ నుంచి ప్రశ్న

అన్నీ చూడండి

Toxic: trailer: బోల్డ్, రా, వైల్డ్, క్రేజీ, అంశాలతో యష్..కియారా అద్వానీ చిత్రం టాక్సిక్: ట్రైలర్

Allari Naresh: కీలక సన్నివేశాల చిత్రీకరణలో రంభ ఊర్వశి మేనక

తొలిరోజే రూ.10.2 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన కొరియన్ కనకరాజు

హీరోకి బాక్సాఫీస్ నంబర్లే ముఖ్యం. అగధ తో నేనూ ఆశిస్తున్నా: శ్రవణ్ రెడ్డి

డెంగ్యూ బారిన పడిన సినీ నటి అవికా గోర్.. భర్త ఏమన్నారంటే? (video)

తర్వాతి కథనం
Show comments