ఫేస్‌బుక్ మరో కీలక నిర్ణయం... ఫేస్‌బుక్ లైవ్‌పై ఆంక్షలు

సోమవారం, 1 ఏప్రియల్ 2019 (18:20 IST)
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు ఈ మధ్య కాలంలో వరుస ఎదురుదెబ్బలు తగులుతుండటంతో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఫేస్‌బుక్ లైవ్‌లను పర్యవేక్షించనుంది. ఈ మేరకు లైవ్‌లో కొన్ని ఆంక్షలు కూడా విధించాలని కూడా ఆ సంస్థ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఫేస్‌బుక్ సీవోవో షెరిల్ శాండ్‌బెర్గ్ వెల్లడించారు.
 
ప్రామాణిక అంశాలపై ఆధారపడి ఫేస్‌బుక్‌లో ఎవరెవరు లైవ్‌కు వెళ్లవచ్చు అనే విషయాన్ని ఫేస్‌బుక్ పరిశీలిస్తోందని ఆమె తన బ్లాగ్‌లో వెల్లడించారు. కాగా ఇటీవల న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన నరమేధం ఫేస్‌బుక్‌లో లైవ్ అయింది. ఈ సంఘటనతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దుమారం చెలరేగడంతో తమ మాధ్యమంలో మరిన్ని ఆంక్షలు విధించాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా లైవ్‌లు, రెచ్చగొట్టే ప్రసంగాలపై ఆంక్షలను విధించనున్నారు.

అన్నీ చూడండి

Thiruveer: నేను కంఫర్టబుల్ గా ఉన్నా, నాటకాలు కంటే సినిమా చాలా పెద్ద బాధ్యత : హీరో తిరువీర్

'సత్లుజ్' మూవీ నిర్మాణ సంస్థపై కేంద్రం కన్నెర్ర.. ఎందుకో తెలుసా?

Varma: అన్వేషణ లో దర్శకుడు వంశీ నాకంటే బాగా సీన్స్ తీశారు : రామ్ గోపాల్ వర్మ

వెంకటేశ్వర స్వామి స్తోత్రాలను వెస్ట్రన్ స్టైల్‌లో విని ఆశ్చర్యపోయా : జి. నాగేశ్వర్ రెడ్డి

Rohit Saraf: ప్రశాంత్ వర్మ చిత్రం మహాకాళి షూటింగ్ పూర్తి చేసిన రోహిత్ సరాఫ్

తర్వాతి కథనం
Show comments