వాట్సాప్‌ యూజర్లకు షాకింగ్ న్యూస్.. వాట్సాప్ కాల్‌తో హ్యాకర్లకు పండగే

మంగళవారం, 14 మే 2019 (18:08 IST)
సోషల్ మీడియాలో అగ్రగామి అయిన వాట్సాప్ యూజర్లకు ఓ షాకింగ్ న్యూస్. వాట్సాప్ ఉపయోగిస్తున్న యూజర్లు అప్రమత్తంగా వుండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.


వాట్సాప్‌లో హ్యాకర్లు సునాయాసంగా ఎంట్రీ అవుతున్నారని ఆ సంస్థ వెల్లడించింది. యూజర్ల డేటాను భద్రపరచడం పెను సవాలుగా మారుతోందని.. యూజర్ల డేటా మొత్తం లింకుల ద్వారా హ్యాకర్ల చేతికి వెళ్లిపోతుందని వాట్సాప్ వెల్లడించింది. 
 
ఒకరితో ఒకరు మాట్లాడేందుకు వాట్సాప్ యాప్‌ను బాగానే ఉపయోగిస్తున్నారు.. యూజర్లు. వాట్సాప్ ద్వారా ఫోటోలు పంపడం, ఫోటో, వీడియోలు, ఆహ్వానాలు పంపుతున్నారు.

ఈ నేపథ్యంలో వాట్సాప్‌లో హ్యాకర్లు ఎంట్రీ ఇస్తున్నారని.. ఈ సమాచారం అంతా సులభంగా దొంగిలించే వీలును కలిగివుందని వాట్సాప్ సంస్థ తెలిపింది. హ్యాకర్లు వాట్సాప్ కాల్ ద్వారా పనికానిచ్చేస్తున్నారు. 
 
వాట్సాప్ కాల్ చేయడం ద్వారా మీ స్మార్ట్ ఫోన్‌పై కన్నేసేందుకు వీలుగా ఓ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ అవుతుంది. ఇలా మీ స్మార్ట్ ఫోన్ హ్యాకర్ల నిఘాలో వుంటుందని వాట్సాప్ షాకింగ్ న్యూస్ వెలువరించింది.


దీనికి బ్రేక్ వేయాలంటే.. వాట్సాప్ యాప్‌ను అప్ డేట్ చేయాలని ఆ సంస్థ పేర్కొంది. ప్రస్తుతం వాట్సాప్ అప్ డేట్‌ను చేయడం ద్వారా హ్యాకర్ల బారి నుంచి తప్పించుకోవచ్చునని సదరు సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది.

అన్నీ చూడండి

Shalini: సింగ్ గీతం లో విలన్ క్యారెక్టర్ చేశాను. మాటే పాటగా మారే కథ ఇది : శాలిని కొండెపుడి

Sunitha: భానుచందర్, సునీత, సి కళ్యాణ్ ఆవిష్కరించిన కొత్త మలుపు ట్రైలర్

SV Krishna Reddy: ఎస్వీ కృష్ణారెడ్డి మ్యూజిక్ కు వరల్డ్ రికార్డ్ గుర్తింపు దక్కింది

Janhvi Kapoor : సినిమా అనేది ప్రజలకు చేసే సేవ : జాన్వీ కపూర్

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ చిత్రం ఇరుముడి గ్లింప్స్ రాబోతోంది

తర్వాతి కథనం
Show comments