పేటీఎంకు మరోసారి ఎదురుదెబ్బ: ముగ్గురూ ఒకేసారి రాజీనామా?

శుక్రవారం, 24 డిశెంబరు 2021 (15:46 IST)
ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ పేటీఎంకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా సంస్థకు చెందిన ముగ్గురు సీనియర్ ఉద్యోగులు బయటకు వెళ్ళిపోయారు. రాజీనామాలు చేసిన వారిలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అభిషేక్ అరుణ్, ఆఫ్ లైన్ పేమెంట్స్ సీవోవో రేణు సాతి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అభిషేక్ గుప్తా ఉన్నారు.
 
వీరు ముగ్గురూ ఒకరివెంట మరొకరు రాజీనామా చేసినట్టు సమాచారం. అభిషేక్ అరుణ్ ఐదేళ్లకు పైగా పేటీఎంలో ఉన్నారు. అభిషేక్ గుప్తా, రేణు సాతి గత ఏడాదే పేటీఎంలో చేరారు. 
 
అయితే వీరు రాజీనామాలు చేసినట్టు పేటీఎం అధికారికంగా ప్రకటించలేదు. ఈ ఏడాది ఆరంభంలో ఐదుగురు సీనియర్ ఎగ్జిక్యూటివ్ లు సంస్థ నుంచి బయటకు వెళ్లారు. ఇటీవలే పేటీఎం ఐపీఓకు వెళ్లింది.
 
అయితే ఈ ఐపీఓ ఆదిలోనే నిరాశపరిచింది. ఈ తరుణంలో ముగ్గురు టాప్ లెవెల్ అధికారులు బయటకు వెళ్లడం కంపెనీకి పెద్ద దెబ్బగానే భావించవచ్చు.

అన్నీ చూడండి

పవన్ కల్యాణ్ గారిని అలా ఎలా అనాలనిపించిందమ్మా?: సుగాలి ప్రీతి తల్లి వ్యాఖ్యలపై హైపర్ ఆది

Pooja Hegde: జిమ్ దుస్తులలో కలిసి కనిపించిన వరుణ్ ధావన్, పూజా హెగ్డే

తాతకు పుష్పాంజలి ఘటించిన ఎన్టీఆర్ - స్మరించుకున్న చిరంజీవి

Alia Bhatt : ఆల్ఫా లో ఆలియా భ‌ట్, శ‌ర్వారి భారీ యాక్షన్ సీన్స్ థ్రిల్లింగ్‌ వుంటాయి: బాబీ డియోల్

Suriya :సూర్య, వెంకీ అట్లూరి చిత్రం‘విశ్వనాథ్ & సన్స్ కు స్వాతంత్య్రం

తర్వాతి కథనం
Show comments