ఢిల్లీ శివార్లలో బీజేపీ సీనియర్ నేత కాన్వాయ్పై 100 రౌండ్ల కాల్పులు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్కు చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత బ్రిజ్పాల్ తియోటియా కాన్వాయ్పై గుర్తు తెలియని దుండగులు 100 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆయన ప్రస్తు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్కు చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత బ్రిజ్పాల్ తియోటియా కాన్వాయ్పై గుర్తు తెలియని దుండగులు 100 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆయన ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘటన గురువారం రాత్రి ఢిల్లీ శివార్లలో జరిగింది.
టొయొటా ఫార్చునర్లో వచ్చిన దుండగులు ఏకే 47 రైఫిల్స్తో వంద రౌండ్ల కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బ్రిజ్పాల్.. ప్రస్తుతం నోయిడాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. ఆయనతోపాటు మరో ఐదుగురు కూడా ఈ ఘటనలో గాయపడ్డారు.