పేయింగ్ గెస్ట్.. ఆరు బయట ఫోన్ మాట్లాడుతుంటే కిడ్నాప్ అయ్యింది.. ఎక్కడ?
ఫోన్ వస్తే చాలు ప్రస్తుతం సెల్ ఫోన్ తీసుకుని ఆరుబయట మాట్లాడటం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. అలా తన ఇంటి బయట నిలబడి మాట్లాడుతున్న ఓ మహిళ అందరూ చూస్తుండగానే కిడ్నాప్కు గురైంది. ఈ ఘటన ఐటీ రాజధానిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మణిపూర్కు చెందిన యువతి బెంగళూరు నగరంలో విధులు నిర్వహిస్తూ పేయింగ్గెస్ట్గా వుంటోంది.
తాను నివాసముండే భవనానికి ముందు ఫోన్లో మాట్లాడుతుండగా ఓ ఆగంతకుడు కిడ్నాప్ చేశాడు. ఏప్రిల్ 23వ తేదీన జరిగిన ఈ ఘటనపై స్థానిక ఛానల్స్ వార్తలు ప్రసారం చేశాయి. సీసీటీవీ దృశ్యాల్ని సైతం ప్రసారం కావడంతో యువతి స్పందించింది.
తనను కిడ్నాప్ చేసిన మాట వాస్తవమేనని.. కిడ్నాప్ చేసిన వ్యక్తి నిర్మాణంలో ఉన్న భవనానికి తీసుకెళ్లి.. అత్యాచారానికి ప్రయత్నించాడని తెలిపింది. అయితే అతని నుంచి అతికష్టంమీద తప్పించుకుని బయటపడ్డానని పోలీసులకు వెల్లడించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.