కేరళలో కరోనా విజృంభణ.. ఆదివారాలు లాక్డౌన్

శుక్రవారం, 21 జనవరి 2022 (14:30 IST)
కేరళలో కరోనా విజృంభిస్తోంది. మూడో వేవ్‌తో కొత్త కేసులు బయటపడుతున్నాయి. గత 24 గంటల్లో 50వేల కొత్త కేసులు నమోదయ్యాయి. జనవరి 20న కేరళలో అత్యధిక స్థాయిలో రోజువారీ కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 
 
రోజువారీ టెస్టుల్లో పాజిటివిటీ రేటు 40 శాతం దాటింది. కోవిడ్ టెస్టుల సంఖ్య పెరిగాయి. రాష్ట్రంలో 46,387 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో మొత్తం 1,15,357 కరోనా పరీక్షలు జరిగాయి. పాజిటివిటీ రేటు 40.21 శాతంగా నమోదైంది.  
 
కేరళ రాష్ట్రంలో మొత్తం 32 కరోనా మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో పెరుగుతున్న కోవిడ్ కేసుల నేపథ్యంలో.. కేరళ ప్రభుత్వం మరిన్ని ఆంక్షలు ప్రకటించింది. వచ్చే రెండు ఆదివారాలు (జనవరి 23, 30) పూర్తి లాక్‌డౌన్‌ విధిస్తున్నట్టు ప్రకటించింది.
 
అన్ని తరగతులు ఆన్‌లైన్‌లోనే జరుగుతాయి. 10, 12వ తరగతి విద్యార్థులకు కూడా ఆన్‌లైన్‌లోనే తరగతులు నిర్వహించనున్నారు. శుక్రవారం నుంచి పాఠశాలల్లో తరగతులు ఉండవు.  

అన్నీ చూడండి

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments