చలికాలం.. చింత చిగురుతో చేపలు కూర.. టేస్ట్ చేస్తే?

ఆదివారం, 27 జనవరి 2019 (18:25 IST)
చేపలు చలికాలంలో తీసుకుంటే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, దగ్గు వంటి రుగ్మతలను దూరం చేసుకోవాలంటే.. చేపలు వారానికి రెండు సార్లైనా డైట్‌లో చేర్చుకోవాలి. ఇంకా చింతచిగురును వంటల్లో లేదా పచ్చడి రూపంలో తీసుకుంటే.. చలికాలంలో శరీరానికి కావలసిన వేడి లభిస్తుంది. అలాంటి చింత చిగురుతో చేపల కూర ఎలా చేయాలో చూద్దాం..
 
చేపలు- అరకేజీ 
చింతపండు-పావు కప్పు
ఉల్లి తరుగు - అర కప్పు 
పచ్చిమిర్చి తరుగు - ఒక స్పూన్ 
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూన్‌
కొత్తిమీర తరుగు - ఒక స్పూన్ 
గరంమసాలా- అరస్పూన్‌,
మిరప పొడి, ఉప్పు- తగినంత 
పోపు దినుసులు - కావలసినంత
పసుపు- తగినంత
నూనె- సరిపడా
 
తయారీ విధానం..
ముందుగా పసుపు పొడి వేసి బాగా శుభ్రం చేసిన చేప ముక్కలను ఆవిరిపై ఉడికించుకోవాలి. తర్వాత ముల్లులు తీసేసి పక్కనబెట్టుకోవాలి. తర్వాత ఓ పాత్రలో నూనె వేసి వేడయ్యాక... పోపు దినుసులు వేసి.. తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని దోరగా వేపుకోవాలి. 
 
బాగా వేగిన తర్వాత.. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర తరుగు, పసుపు అందులో చింత చిగురు పోసి మిరపపొడి, ఉప్పు వేసి కలియబెట్టాలి. చింతపండు పులుసు మరుగుతున్న సమయంలో చేప ముక్కలను వేసుకుని ఉడికించుకోవాలి. తర్వాత గరంమసాలా, బెల్లం పొడి వేసుకోవాలి. చివరిగా కొత్తిమీర, కరివేపాకు తరుగు చేర్చి దించేయాలి. 

అన్నీ చూడండి

వైకాపా మాజీ మంత్రి రజనీపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు - పాస్‌పోర్టు అప్పగింత

భవిష్యత్‌‌కు ప్రపంచ టెలీకమ్యూనికేషన్ : సీఎం చంద్రబాబు

నీట్ యూజీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ప్రొఫెసర్ మనీషా అరెస్టు

భార్యను గొడ్డలితో నరికేసి ఠాణాకు వెళ్లి లొంగిపోయిన వృద్ధుడు

లైంగిక వేధింపులు - భారత సంతతికి చెందిన 13 యేళ్ల జైలు

అన్నీ చూడండి

రజనీకాంత్‌తో పోటీపడతాను.. అసూయ లేదు : కమల్ హాసన్

నడిరోడ్డుపై నటి పావలా శ్యామల - నిర్మాత దిల్ రాజు పెద్ద మనసు

పెద్ది చిత్రం మల్లయోధుడు కోడి బయోపిక్ కాదు : డైరెక్టర్ బుచ్చిబాబు

నన్ను ఒక్కరు కూడా పట్టించుకోలేదు, నా ఇగో హర్ట్ అయ్యింది: రజినీకాంత్

Kenisha: జయం రవి, గాయని కెనీషా మధ్య రిలేషన్‌షిప్‌ కట్

తర్వాతి కథనం
Show comments