ఆవనూనె, పామాయిల్‌తో దీపమెలిగించారో.. ఇక అంతే సంగతులు?! (video)

Written By సెల్వి
Updated: బుధవారం, 15 జులై 2020 (20:27 IST)
రోజూ మనం వెలిగించాల్సిన దీపాల కోసం మనం వినియోగించే నూనెల గురించి తెలుసుకుందాం.. రోజూ ఉదయం లేదా సాయంత్రం పూట దీపారాధన చేయడం మంచిది. దీపారాధన మహిళలే చేయడం విశేష ఫలితాలను ఇస్తుంది.

సాయంత్రం పూట ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత దీపాన్ని వెలిగించి పూజ చేయాలి. దీపానికి నెయ్యి, వేపనూనె, కొబ్బరి నూనె, ఆముదం వంటి వాటిని కలిపి వెలిగిస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. 
 
నేతితో దీపం వెలిగించడం ద్వారా సకల సంతోషాలు చేకూరుతాయి. నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడం ద్వారా గృహంలోని ప్రతికూల ఫలితాలు తొలగిపోతాయి. దోషాలుండవు.

ఆముదంతో దీపం వెలిగిస్తే.. కీర్తిప్రతిష్ఠలు చేకూరుతాయి. సిరిసంపదలు చేకూరుతాయి. దారిద్ర్యం తొలగిపోతుంది. ఆవు నేతితో దీపం వెలిగిస్తే దంపతుల మధ్య కలహాలుండవు. అన్యోన్యత పెంపొందుతుంది.

ఇంటి దేవత అనుగ్రహం పొందాలనుకునేవారు ఆముదంతో దీపాలను వెలిగించాలి. వంశవృద్ధికి ఆముదంతో ఇంట దీపం వెలిగించాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. 
 
అయితే ఆవనూనె, పామాయిల్, వేరుశెనగల నూనెను దీపారాధానకు ఉపయోగించకూడదు. ఇంట్లోనే కాకుండా ఆలయాల్లో ఈ నూనెను దీపారాధనకు వాడకూడదు. ఈ నూనెలతో దీపమెలిగిస్తే ఇబ్బందులు, ఈతిబాధలు, పాపాలు, దోషాలు తప్పవని ఆధ్యాత్మిక పండితులు హెచ్చరిస్తున్నారు.

 

అన్నీ చూడండి

భారతదేశంలోని వృద్ధుల కోసం మూడు కొత్త ఆవిష్కరణలు: అన్వయా కిన్ కేర్

జంతర్ మంతర్ వద్ద సంబరాలు.. నన్ను హీరోను చేయకండి.. ఇంతటితో ఆగిపోలేదు.. (video)

సవతి కొడుకుతో అక్రమ సంబంధం.. వేరే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు.. కానీ..?

ప్రధాని మోడీ గురించి తప్పుగా మాట్లాడితే దేశ ప్రజలు సహించరు, ఇదిగో నిదర్శనం వీడియో

కేతన్ లోయలో పడిపోయాడని చెప్పింది.. కానీ కంటిలో ఒక్క కన్నీటి బొట్టు కూడా రాలేదు..

అన్నీ చూడండి

26-07-2026 నుంచి 01-08-2026 వరకు మీ వార రాశి ఫలితాలు

వేములవాడ ఆలయంలో లడ్డూ ప్రసాదం ధరల సవరింపు

25-07-2026 శనివారం ఫలితాలు - మీ అలక్ష్యం సమస్యకు దారితీస్తుంది

ఆర్థిక ఇబ్బందులను తొలగించుకోవాలంటే శనివారం ఇలా చేస్తే?

40 రోజుల పాటు శ్రీవారి పుష్కరిణి మూసివేత.. ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments