అబ్బా.. అప్పుల బాధ తీరేదెలా? చీమలకు చక్కెర వేస్తే? (video)

Written By కుమార్
Updated: శనివారం, 1 జూన్ 2019 (13:09 IST)
ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఏదో ఒక సందర్భంలో అప్పులు చేసి ఉంటారు. వ్యాపార అవసరాల కోసమో, వ్యక్తిగత అవసరాల కోసమో మరేదైనా కారణం కోసమో అప్పులు చేయడం సహజం.

అయితే కొందరు తీసుకున్న అప్పులను తీర్చడానికి నానా ఇబ్బందులు పడుతుంటారు. అయితే కొన్ని రకాల నియమాలను పాటించడం ద్వారా అప్పుల బాధ నుండి బయటపడవచ్చంటున్నారు పండితులు. అవి ఏమిటో ఇక్కడ చూద్దాం.
 
ప్రతి బుధవారం రెండు చిన్న చిన్న ఖాళీ కుండల్లో ముద్ద కర్పూరం వెలిగించి వాటిని ప్రవహిస్తున్న నీటిలో వదిలేయండి. ఇలా ఆరు వారాల పాటు చేస్తే చాలు. మీ వ్యాపారం మంచి లాభాల బాట పడుతుంది.
 
పీచు తీసిన ఒక కొబ్బరికాయకు కుంకుమ బొట్టు పెట్టి మనస్ఫూర్తిగా లక్ష్మీదేవిని స్మరించుకుని ఆ కొబ్బరికాయను నీటిలో జారవిడవండి. మీరు అనుకున్న కోరిక తీరుతుంది.
 
పసుపు వత్తులతో 5 గురువారాలు ఆవునెయ్యితో లక్ష్మి దేవి వద్ద దీపం పెట్టి  కనకధార స్తోత్రాన్ని పటించండి, అలాగే చీమలకు చక్కెర వేస్తుండటం వల్ల అప్పుల బాధలు త్వరగా తీరిపోతాయి. 
 
ఉదయం లేవగానే రెండు అరచేతులు దగ్గరగా చేసి అందులోకి చూడండి. విష్ణు, మహాలక్ష్మిల అనుగ్రహం పొందడమే కాకుండా అప్పుల బాధ తీరి, మీ వ్యాపారం లాభసాటిగా సాగుతుంది.

అన్నీ చూడండి

ఈ వేసవిలో దుబాయ్‌లో పిల్లలకు వినోదాన్ని అందించండి

రీల్స్ తీసే కెమెరామెన్‌‍ను పెళ్లాడిన ముగ్గురు అక్కా చెల్లెళ్లు... ఎవరా అదృష్టవంతుడు?

తోటి ఉద్యోగులు పట్టించుకోలేదు.. ఆ స్ట్రీట్ డాగ్ విశ్వాసం చూపింది (వీడియో)

ప్రధాని మోడీ ట్వీట్‌తో ఒరిగేదేమీలేదు : ధర్మేంద్ర రాజీనామా చేయాల్సిందే : సీజేపీ

విద్యార్థుల ఆందోళనపై బాలీవుడ్ నటుల మౌనం : శశిథరూర్ విమర్శలు

అన్నీ చూడండి

TTD: శ్రీవాణి దర్శన టిక్కెట్ల కోసం ప్రత్యేక వెయిటింగ్ లాంజ్‌

తిరుమల 7వ మైలు వద్ద శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం చోరీ.. అలా కనిపెట్టేశారు..

23-07-2026 గురువారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

భక్తుల రద్దీ: గురువారం నాటి SSD టోకెన్లను రద్దు చేసిన టీటీడీ

32 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ - సింహాచలంలో భారీ ఏర్పాట్లు

తర్వాతి కథనం
Show comments