షిరిడీ సాయిబాబా మహిమాన్వితం...

షిరిడీలో గల సాయిబాబా మహిమలు గురించి అక్కడి చుట్టుప్రక్కల గ్రామాలలో చెప్పుకుంటుంటారు. ఈ మాటలను బాబా వింటుంటారు. చాలాకాలం క్రితం హఠాత్తుగా చూపు కోల్పోయిన ఒక వ్యక్తి నానా అవస్థలతో బాధపడుతున్నాడు. చూపు రా

గురువారం, 2 ఆగస్టు 2018 (11:44 IST)
షిరిడీలో గల సాయిబాబా మహిమలు గురించి అక్కడి చుట్టుప్రక్కల గ్రామాలలో చెప్పుకుంటుంటారు. ఈ మాటలను బాబా వింటుంటారు. చాలాకాలం క్రితం హఠాత్తుగా చూపు కోల్పోయిన ఒక వ్యక్తి నానా అవస్థలతో బాధపడుతున్నాడు. చూపు రావడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసాడు. కానీ అవి ఏవి ఫలించలేదు. ఇన తనకి చూపు రాదని నిర్ధారణ చేసుకుని జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు.
 
భక్తులు మాటలను వింటున్న ఆ వ్యక్తి బాబాను చూడాలనిమించింది. ఆయనను చూపురాకపోయిన పర్వాలేదు బాబా సన్నిధిలో ఉండిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ వ్యక్తి బాబాను చూసేందుకు షిరిడీ వెళ్లే వారితో కలిసి బయలుదేరాడు. అలా షిరిడీ వరకూ నడచి వెళ్లిన ఆ వ్యక్తికి ఆ ఊళ్లోకి అడుగుపెట్టగానే చూపువచ్చేసింది. 
 
అంతే ఆ వ్యక్తి సంతోషంతో పొంగిపోతూ బాబా ఉండే మశీదు వైపుకు పరుగులు తీస్తాడు. బాబా కనిపించగానే ఆయన పాదాలపై పడతాడు. బాబా ఆ వ్యక్తిని పైకి లేవనెత్తి తాను అందంగా కనిపిస్తున్నారని నవ్వుతూ అతనిని అడిగాడు. అంతే ఆ వ్యక్తి ఒక్కసారిగా పెద్దగా ఏడవడం మెుదలుపెట్టాడు. తనకు చూపు వచ్చిందనే సంతోషం కన్నా ఆ చూపుతో బాబాను చూడగలిగినందుకు ఆనందంగా ఉందని చెబుతున్నాడు. 

అన్నీ చూడండి

సామాన్య భక్తురాలిలా అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న అన్నాలెజినోవా

గుర్తించడం, అడ్డుకోవడం, నాశనం చేయడం ద్వారా నార్కో-టెర్రర్‌ను నిర్మూలిస్తాం: హోం మంత్రి అమిత్ షా

కోవిడ్ కేసులు: కేరళలో 115, కర్నాటక 64, ఏపీలో 13 మాత్రమే, కానీ అప్రమత్తం

జోహార్ ముద్రగడ అనే నినాదాలు మాని సీఎం జగన్ అంటారా?: ప్రొఫెసర్ నాగేశ్వర్ విమర్శ

దేశంలో అంధకారం నెలకొనవచ్చు : ప్రజలకు ఇరాన్ హెచ్చరిక

అన్నీ చూడండి

17-07-2026 శుక్రవారం ఫలితాలు - లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి..

Anivara Asthanam: తిరుమలలో ఆణివార దేవస్థానం..

శ్రీనివాసమంగాపురంలో జూలై 17 నుండి వార్షిక సాక్షాత్కార వైభవోత్సవాలు

ఆషాఢ బోనాల ఉత్సవాలు.. కుమ్మర కులస్తుల తొలి బోనాల సమర్పణ

16-07-2026 గురువారం ఫలితాలు - పరిస్థితులు అనుకూలిస్తాయి

తర్వాతి కథనం
Show comments