కార్యార్థియైన ధీరుడు ఎలా వుంటాడో తెలుసా?

శుక్రవారం, 8 ఏప్రియల్ 2022 (23:30 IST)
కార్యార్థి అయినవాడు సందర్భాన్ని బట్టి మెసలడంలో నేర్పరి అయి వుంటాడు. అతడు వీలునుబట్టి ఒకచోట భూశయనానికి అయినా సిద్ధపడతాడు. పరుపులపై పడుకునే అవకాశం వున్నప్పుడు, దానిని ఉపయోగించుకుంటాడు.

 
షడ్రషోపేతమైన భోజనం దొరికితే సరే... లేదంటే కాయగూరలతో చేసినవైనా ఆఖరికి పచ్చడి మెతుకులు తింటూ సరిపుచ్చుకుంటాడు. ఒకచోట పట్టుపీతాంబరాలను ధరించగలడు. వేరొకచోట బొంతగుడ్డపైన పడుకోగలడు.

 
అయితే అన్నింటికంటే ముఖ్యంగా చెప్పుకోవలసినది ఏంటంటే... కష్టాలు కలిగాయని దుఃఖించడమో, సుఖాలు లభించాయని ఆనందించడమో వుండదు అతనికి. నీతివేత్తలైనవారి చేత పొగడబడినా, కొన్ని సందర్భాల్లో వారి చేతనే విమర్శించినా ధీరులు తమ న్యాయమార్గాన్ని విడిచిపెట్టరు. ఎందుకంటే వారికి తాము అనుసరిస్తున్న మార్గం న్యాయమైనది అనే స్పృహ వుంటుంది కనుక.

 
అలాగే సంపదలు వచ్చినా, పోయినా, ఆ క్షణమే ప్రాణం పోతున్నా చాలా కాలం బ్రతికినా న్యాయం మాత్రం తప్పరు వీరు. ప్రశంసలకు, విమర్శలకు, అల్పాయుష్షుకు, అధికాయుష్షుకు న్యాయమార్గానుసారం నడిచేవారు లొంగరు. అదే వారి బలం.

అన్నీ చూడండి

డీఎంకే చీఫ్ స్టాలిన్‌కు వార్నింగ్... 48 గంటల్లో సారీ చెప్పాలి : టీవీకే మంత్రి హెచ్చరిక

ఈ నెల 21న రీనీట్ ప్రవేశ పరీక్ష.. చదువులో ఒత్తిడి... ఆశించిన ఫలితాలు రాలేదనీ... ఇంటర్ విద్యార్థిని సూసైడ్

రీనీట్ ప్రవేశ పరీక్ష : టెలిగ్రామ్ సేవలపై కేంద్రం నిషేధం - కోర్టులో సవాల్

అభిమాని చెయ్యి పట్టి.. గుండెలకు హత్తుకుని! నిరంజన్‌కు పవన్ ఓదార్పు (వీడియో)

సిక్కింలో అరుదైన టాకిన్ మంద గుర్తింపు (వీడియో)

అన్నీ చూడండి

17-06-2026 బుధవారం ఫలితాలు - వ్యవహారాల్లో ఒత్తిడికి గురికావద్దు....

Elachi Lamp: ఉన్నత ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? ఏలకుల దీపం వెలిగిస్తే?

16-06-2026 మంగళవారం ఫలితాలు- అతిగా శ్రమించవద్దు

15-06-2026 సోమవారం ఫలితాలు - పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు....

సాయిబాబా తన భక్తులు దైనందిన జీవితంలో పాటించాలని బోధించిన 4 ముఖ్య సూత్రాలు ఏవి?

తర్వాతి కథనం
Show comments