దైవానికి దగ్గర కావడానికి అలా చేయవలసిందేనా?

శుక్రవారం, 7 జూన్ 2019 (22:13 IST)
అంతఃచేతనలో పూర్తిగా పరమాత్మ స్వరూపం నిండిన తరువాత కూడా మహర్షులు, యోగులు, సిద్దులు మహనీయులైన మన పూర్వికులు స్వధర్మాచరణను విడిచి పెట్టలేదు. ఆధునిక కాలంలో ఈ ధర్మాచరణ పట్ల సరైన అవగాహన లేక, అలా అవగాహన కల్పించేవారు లేక పొందాల్సిన జ్ఞానాన్ని పొందలేకపోతున్నారు. 
 
నవవిధ భక్తులలో మొదటిది అర్చన. కొందరు పరమాత్మ గుణ గాన సంకీర్తనాన్ని ఎంచుకుని తరించారు. ఎవరు ఏ మార్గాన్ని ఎంచుకున్న ఆ మార్గాలన్నింటి లక్ష్యం పరమాత్మని చేరుకోవడమే. మనసులో కల్మషం నింపుకుని ఉన్నప్పుడు ఎన్ని పూజలు చేసినా ప్రయోజనం లేదు. మనసు నిర్మలంగా సర్వ భూత హితకారియై ఉన్నప్పుడు, నిరంతరం పరమాత్మలో లీనమై చరించేటప్పుడు ఏలాంటి పూజలు చేయకపోయినా ఫరవాలేదు. ఆ స్థితికి చేరుకోవడం చాలా కష్టం. 
 
కానీ... అలా చేరుకున్నప్పటికీ స్వధర్మానుష్టానాన్ని విడిచిపెట్టుకోవడం మాత్రం ఏ మాత్రం మంచిది కాదు. మీరు చేసే పూజలు, పునస్కారాలు మిమ్మల్ని ధర్మమార్గంలో పట్టి నిలిపి ఉంచుతాయి. ధార్మిక చింతనల వలన మీ మదిలో చెడు ఆలోచనలు రావు. ఆ నిష్ట చెదరకుండా ఎప్పటికి నిలచి ఉండడానికి ఆధ్యాత్మిక దివ్య సాధనలో మీరు మరింతగా పురోగమించడానికి పరిపూర్ణంగా పరమాత్మ సాక్షాత్కారం కలగడానికి ఆ పూజలు ఖచ్చితంగా దోహదపడతాయి. మనసు పరమాత్మలో పూర్తిగా లీనమై ఉన్నప్పుడు మాట కూడా మంత్రం అవుతుంది. దృష్టి ప్రాపంచిక విషయాలపై ఉన్నప్పుడు మంత్రం కూడా మాట లాగే వినపడుతుంది. ఈ రెండిటికి మధ్య భేదాన్ని గుర్తించగలిగే స్థాయి పరిణతి చాలా అవసరం.

అన్నీ చూడండి

నీట్ ప్రశ్నపత్రం లీక్ నిందితుడు రీనీట్ రాసేందుకు అనుమతి... ఎలా?

కార్పొరేట్ ఉద్యోగానికి కాదని ఉబెర్ డ్రైవర్‌గా మారిన హైదరాబాద్ వ్యక్తి...

నీట్ రీ-టెస్ట్ భద్రత ఏర్పాట్లపై అన్నామలై మండిపాటు.. పరీక్షా సమయం పెంపుపై అభ్యంతరం

అయోధ్య బాల రాముడికి అరుదైన కానుక - అత్యంత ఖరీదైన మామిడి పండు సమర్పణ

హోం మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు.. ఖండించిన ఏపీ డిప్యూటీ సీఎం

అన్నీ చూడండి

Elachi Lamp: ఉన్నత ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? ఏలకుల దీపం వెలిగిస్తే?

16-06-2026 మంగళవారం ఫలితాలు- అతిగా శ్రమించవద్దు

15-06-2026 సోమవారం ఫలితాలు - పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు....

సాయిబాబా తన భక్తులు దైనందిన జీవితంలో పాటించాలని బోధించిన 4 ముఖ్య సూత్రాలు ఏవి?

14-06-2016 ఆదివారం ఫలితాలు-పొగిడే వ్యక్తులతో జాగ్రత్త..

తర్వాతి కథనం
Show comments