Webdunia - Bharat's app for daily news and videos

Install App

పళని దండాయుధ పాణి ఆలయంలో కుంభాభిషేకం (video)

Written By సెల్వి
Updated: శుక్రవారం, 27 జనవరి 2023 (14:21 IST)
Palani kumbabishekam
పళని దండాయుధ పాణి ఆలయంలో జనవరి 27న కుంభాభిషేకం అట్టహాసంగా జరిగింది. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు జరిగింది. దండాయుధపాణి స్వామి ఆలయం తమిళనాడు దిండుక్కల్ జిల్లాలోని పళనిలో ఉంది. కుమార స్వామి ప్రతిష్టాత్మక ఆరు క్షేత్రాల్లో ఒకటి. ఈ ఆలయంలోని మూలవిరాట్టు నవపాషాణంతో రూపుదిద్దుకుంది.
 
పాదవినాయకుడు, క్షేత్రపాలకులు, 5 నెమలి విగ్రహాలు, మెట్ల దారి క్షేత్రాలు, వినాయగర్ విగ్రహాలు, ఇడుంబన్, కడంబన్, అగస్త్యుడు, సర్ప వినాయకుడు, జంట వినాయకుల విగ్రహాలకు కుంభాభిషేకం జరుగనుంది. 
 
ఈ పళని ఆలయంలో 16 ఏళ్ల తర్వాత 27వ తేదీన కుంభాభిషేకం జరిగింది. ఉదయం 8 గంటల నుంచి 9.30 గంటల మధ్య రాజగోపురం, స్వర్ణ విమానానికి తీర్థ అభిషేకం, అనంతరం స్వామివారికి కుంభాభిషేక కార్యక్రమం నిర్వహించారు. 
Palani kumbabishekam
 
కుంభాభిషేకం సందర్భంగా ఈరోజు తెల్లవారుజామున 4.30 గంటలకు 8వ యాగశాల పూజలు ప్రారంభమయ్యాయి. కుంభాభిషేకం సందర్భంగా దీపారాధన అనంతరం రాజగోపురంతో పాటు ఆలయ సముదాయం అంతటా హెలికాప్టర్‌లో పుష్పయాగం నిర్వహించారు. ఇందుకోసం బెంగళూరు నుంచి ప్రైవేట్ హెలికాప్టర్‌ను రప్పించారు.

అన్నీ చూడండి

హైదరాబాద్‌లో జోరుగా కల్తీ నెయ్యి విక్రయాలు - 36 టన్నుల కల్తీ నెయ్యి స్వాధీనం (Video)

ప్రసాదం ఇస్తామని ఇంటికి రప్పించుకుని... బంగారం, నగదు కొట్టేసిన జంట అరెస్ట్

మూడో బిడ్డకు కూడా 12 వారాల ప్రసూతి సెలవులు ఇక 365 రోజులకు పెంపు

హర్మూజ్ జలసంధి మాదే... అమెరికా కొత్త భూభాగ మ్యాప్‌ను రిలీజ్ చేసిన ట్రంప్

ప్రజల గొంతుక వినిపించేందుకు కొత్త పార్టీని స్థాపిస్తా : విజయసాయి రెడ్డి

అన్నీ చూడండి

19-08-2026 బుధవారం నాటి మీ రాశి ఫలితాలు - దంపతుల మధ్య స్వల్ప కలహం

శ్రావణ మంగళవారం రోజున ఇలా పూజిస్తే.. సర్వం శుభమే

18-08-2026 మంగళవారం నాటి మీ రాశి ఫలితాలు - కష్టించినా ఫలితం శూన్యం

Shasti Vrat: షష్టి వ్రతాన్ని ఆరు మాసాలు ఆచరిస్తే.. ఏంటి ఫలితం?

17-08-2026 సోమవారం ఫలితాలు - ఈ రోజు కలిసివచ్చే సమయం..

తర్వాతి కథనం
Show comments