Webdunia - Bharat's app for daily news and videos

Install App

షిర్డిసాయి, జ్ఞానహినులు బోర్లించిన కుండలు వంటివారు

Written By సిహెచ్
Updated: బుధవారం, 24 జూన్ 2020 (22:21 IST)
షిర్డిసాయిబాబా భక్తులకు ఎన్నో విధాలుగా తన మహిమలు చూపారు. కోపర్గాం స్టేషన్ మాస్టరు వాలంబికి సాయిబాబా యందు విశ్వాసం లేదు. ఇతను ఒకసారి దాసుగణుతో... సాయిబాబా పిచ్చివాడు, మీరు ఎందుకు ఆయన వద్దకు వెళుతున్నారు అని అన్నాడు. 
 
అటు తర్వాత ఒకసారి దాసగణు షిరిడికి వెళుతూ వాలంబిని కూడా తనతో షిరిడికి తీసుకొని వచ్చారు. ఇద్దరూ శ్రీ సాయిబాబావారి దర్శనానికి వెళ్లారు. వారు మసీదుకు వెళ్లినప్పుడు బాబా మట్టిపాత్రలను కడిగి వాటిని నేలపై బోర్లిస్తూ వున్నాడు.
 
వాలంబి అది చూచి, బాబా ఆ మట్టి పాత్రలను ఎందుకు బోర్లా పెడుతున్నారు.? అని ప్రశ్నించాడు. నా వద్దకు వచ్చేవారందరు ఈ పాత్రలవలె అదోముఖంగా వుంటారని బాబా అన్నారు. అంటే తమ వద్దకు వచ్చేవారందరు అజ్ఞానులు గానే వస్తుంటారని బాబా తన అభిప్రాయమును భవగర్భితముగా వివరించారు.
 
ఎవరైతే బాబా వద్దకు ఐహిక కోరికలతో వస్తారో వారు శ్రీ సాయిదేవుని పూర్తిగా గ్రహించలేరని తెలుసుకోవాలి. బాబా వద్దకు జ్ఞానహీనులుగా ఎవరైతే వెళతారో వారందరిని జ్ఞానవంతులుగా చేయుటయే శ్రీ సాయిబాబా మార్గం.

అన్నీ చూడండి

సెప్టెంబర్ - అక్టోబర్ 2027లో వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర

జైషే చీఫ్ మసూద్ అజర్ మా వద్ద లేరు : పాక్‌కు తేల్చి చెప్పిన ఆప్ఘనిస్థాన్

రూ.500కే ఏఐ సర్టిఫికేట్ కోర్సును ఆఫర్ చేస్తున్న ఐఐటీ మద్రాస్

అరుదైన ఒరాంగుటాన్లు.. బిచిత్రాపూర్ అటవీ ప్రాంతం నుండి రక్షించిన అధికారులు

హల్లో ఇంట్లో ఎవరున్నారు... మహిళకు వేధింపులు...

అన్నీ చూడండి

09-09-2026- బుధవారం మీ రాశి ఫలితాలు.. ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు

Tirumala: తిరుమల రాజగోపురంపై శ్రీకృష్ణుని విగ్రహపు చేయి విరిగిపోయిందా?

టీటీడీ భద్రతా ఉద్యోగులకు మాజీ సైనికులు అర్హులే..

08-09-2026 మంగళవారం ఫలితాలు - అనవసరమైన ఖర్చులు చేయవద్దు..

శ్రీవారి బ్రహ్మోత్సవాలు-2026.. టీటీడీ సిబ్బంది వివరాల తనిఖీ.. క్రిమినల్ కేసులు ఉన్నాయేమో?

తర్వాతి కథనం
Show comments