శిరిడీలో భక్తులు నివశిస్తున్నప్పుడు సాయిబాబా ఎవరికీ ఊదీ ఇచ్చేవారు కాదు. ఐతే విభూతి ఇస్తున్నప్పుడు మాత్రం ఈ విశ్వమంతా భస్మంలా అశాశ్వతమని గ్రహించండి అని సూచించేవారు. ఆ కట్టెల మాదిరిగానే ఈ శరీరం కూడా. ఈ దేహం పంచభూత నిర్మితం అయిున్నంత వరకూ ఇది వుంటుంది. ఆయువు తీరగానే ఇది శవమైపోతుంది. కాలి బూడిదవుతుంది. నేనూ, మీరూ అందరం కూడా ఈ స్థితికి చేరుకుంటాం. మీరంతా దీనిని జ్ఞాపకం...