గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 23 డిశెంబరు 2019 (15:11 IST)

అందుకే వెళ్ళిపోతున్నానండీ.. భర్తకు భార్య వాట్సాప్ వాయిస్ మెసేజ్

కన్యాకుమారిలో వివాహం జరిగిన కొన్ని రోజుల్లోనే తన ప్రియుడితో కలిసి పారిపోయింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. కన్యాకుమారి జిల్లా, వెల్లసందై ప్రాంతానికి చెందిన వేల్ మురుగన్ (26)కు అదే ప్రాంతానికి చెందిన రాజశ్రీ (23)ని వివాహం చేసుకున్నాడు. గత నవంబర్ 24వ తేదీ వీరి వివాహం జరిగింది. 
 
కొద్దిరోజుల క్రితం వేల్ మురుగన్ పనికి వెళ్లిన సమయం చూసుకుని రాజశ్రీ తన ప్రియుడితో పారిపోయింది. అయితే భార్య కనిపించలేదని వేల్ మురుగన్ ఎక్కడెక్కడో వెతికాడు. ఆ సమయంలో అతని సెల్ ఫోన్‌కు వాట్సాప్ వాయిస్ మెసేజ్ వచ్చింది. అందులో రాజశ్రీ తన భర్తను నచ్చలేదని చెప్పింది. తనకు నచ్చిన జీవితాన్ని వెతుక్కుని వెళ్తున్నట్లు వెల్లడించింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు వేల్ మురుగన్. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ మొదలెట్టారు. ఈ దర్యాప్తులో రాజశ్రీ తన ఇంటికి సమీపంలో నివసిస్తున్న సంతోష్ అనే వ్యక్తితో పారిపోయినట్లు తెలిసింది. వీరిద్దరూ పెళ్లికి నుంచి ప్రేమించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో అవమానం భరించలేక సంతోష్ తండ్రి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంకా రాజశ్రీ, సంతోష్ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.