శ్రీవారి భక్తులు ఈనెల 26వ తేదీ తిరుమల రావొద్దండి, ఎందుకంటే?

సోమవారం, 16 డిశెంబరు 2019 (19:44 IST)
తిరుమల శ్రీవారి ఆలయాన్ని సూర్యగ్రహణం సందర్భంగా ఈ నెల 26వ తేదీన మూసివేయనున్నారు. పదమూడు గంటల పాటు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు టిటిడి ఉన్నతాధికారులు తెలిపారు. 26వ తేదీ ఉదయం 8.08 గంటల నుంచి 11.16 గంటల వరకు సూర్యగ్రహణం ఉందని, గ్రహణానికి ఆరు గంటల ముందు నుంచి ఆలయం తలుపులు మూసివేయనున్నారు.
 
ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల తరువాత ఆలయాన్ని శుద్థి చేసి ఆ తరువాత ఆలయ తలుపులు తెరవనున్నారు. ఆలయాన్ని మూసి వేసిన సమయంలో తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సమయంలో వితరణ నిలిపివేయనున్నారు. అలాగే గ్రహణం కారణంగా తిరుప్పావడ సేవ, కళ్యాణం, ఊంజల్ సేవ, వసంతోత్సవ సేవలను టిటిడి రద్దు చేయనుంది. గ్రహణం సమయంలో శ్రీవారి ఆలయంతో పాటు టిటిడికి చెందిన అనుబంధ ఆలయాలన్నింటినీ కూడా మూసివేయనున్నారు. 

అన్నీ చూడండి

గిరిజన గ్రామంలో తాగు నీటి కొరత.. ఖాళీ బిందెలతో మహిళల నిరసన

ఉత్తరాదిన కుమ్మేస్తున్న భారీ వర్షాలు.. ముంబైలో మూడు రోజుల వర్షానికి నలుగురు మృతి

బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

Hyderabad: ఆర్మీ ఆఫీసర్‌ అని మోసం.. డబ్బు గుంజేసిన హైదరాబాద్ వ్యక్తి అరెస్ట్

హైదరాబాద్ నగరంలో ఘరానా మోసం.. మటన్ పేరుతో గొడ్డు మాంసం విక్రయం

అన్నీ చూడండి

రికార్డు స్థాయిలో అమ్ముడుబోయిన శ్రీవారి లడ్డూ ప్రసాదం

03-07-2026 శుక్రవారం ఫలితాలు - మనోభీష్టం సిద్ధిస్తుంది

Sankatahara Chaturthi 2026: జూలై 3న కృష్ణ పింగళ సంకష్టి చతుర్థి.. 21 జిల్లేడు ఆకుల పూజ చేసినా..

02-07-2026 గురువారం ఫలితాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి

01-07-2026 బుధవారం ఫలితాలు - రుణ సమస్య కొలిక్కి వస్తుంది

తర్వాతి కథనం
Show comments