తిరుమలలో రికార్డు స్థాయిలో శ్రీవారి దర్శనం.. 43 రోజుల్లో స్వామి సేవలో 35 లక్షల మంది

సోమవారం, 13 జూన్ 2016 (10:23 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం మరో కొత్త రికార్డును నమోదు చేసింది. అది కూడా అధిక సంఖ్యలో భక్తులకు దర్శనం చేయించి. గతంలో వేసవి కాలంలో ఎప్పుడూ లేనివిధంగా అనూహ్యంగా వచ్చిన భక్తులకు త్వరితగతిన దర్శన భాగ్యం కల్పించింది. మే 1వ తేదీ నుంచి ఆదివారం వరకు 43 రోజుల్లో 35 లక్షల మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 
 
సాధారణంగా భక్తుల రద్దీ పెరిగితే ఆందోళనలు, తితిదే ఉన్నతాధికారులపై శాపనార్థాలు ఉంటాయి. అయితే ఈసారి మాత్రం పెద్దగా ఎక్కడ కూడా ఇలాంటివి కనిపించలేదు. కారణం వచ్చిన భక్తులను కంపార్టుమెంట్ల నుంచి అలాగే క్యూలైన్లలోకి వదలడం. దీని కారణంగా త్వరితగతిన భక్తులు దర్శనం చేసుకోగలిగారు. 
 
తితిదే ఈఓ సాంబశివరావుతో పాటు జెఈఓ శ్రీనివాసరాజుల పర్యవేక్షణే ఇందుకు కారణమని చెప్పుకోవచ్చు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చిన సమయంలో వెంటనే వీఐపీ దర్శనాలను రద్దు చేయడమో, తగ్గించడమో చేయడం వల్ల సామాన్యభక్తులు అధికసంఖ్యలో స్వామివారిని దర్శించుకోగలిగారు. 

అన్నీ చూడండి

టెక్కీ రాధా గాయత్రి మృతి కేసులో వీడని మిస్టరీ : భర్త శ్రీచరణ్‌కు మరో వ్యక్తి సాయం?

శ్రీవారి భక్తులకు అలెర్ట్ : ఆ రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు

ఇరాన్‌తో కాల్పుల విరమణ ముగిసింది : డోనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన

నిరంజన్ ఫ్యామిలీకి బాలీవుడ్ నటుడు సోనూ సూద్ భరోసా (వీడియో)

రావణ్ వ్యాఖ్యలే జగన్‌కు ముఖ్యమా? మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

అన్నీ చూడండి

08-07-2025 మంగళవారం ఫలితాలు - తొందరపాటు నిర్ణయాలు తగవు....

ఈ పంచ కన్యల శ్లోకం స్మరిస్తే మహాపాతకాలు పోతాయ్

07-07-2026 మంగళవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనయోగం ఉన్నాయి.. ఏ రాశికి?

జూలై 7, 2026: కాలాష్టమి.. తేనె రాసిన జిల్లేడు ఆకులు.. నైవేద్యంగా రెండు గులాబ్‌జామూన్‌లు..?

06-07-2026 సోమవారం ఫలితాలు - ఆర్థికలావాదేవీలతో సతమతమవుతారు...

తర్వాతి కథనం
Show comments