Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీవారి పుష్కరిణి మూసివేత.. ఎందుకో తెలుసా?

Written By ఠాగూర్
Updated: ఆదివారం, 10 నవంబరు 2019 (11:37 IST)
కలియుగదైవం కొలువైవున్న తిరుమలలో శ్రీవారి పుష్కరిణి పూర్తిగా మూసివేశారు. పుష్కరిణికి అన్ని వైపులా ఉన్న గేట్లకు అధికారులు తాళాలు వేశారు. దీంతో తిరుమలకు వచ్చే భక్తులు పుష్కరిణిలో స్నానాలు చేసేందుకు వీలులేదు. 
 
ప్రతి యేటా వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందు ఆగస్టులో పుష్కరిణిని మూసివేసి కోనేరులోని నీటిని మార్చడం ఆనవాయితీ. అయితే, ఈ యేడాది నీటి ఎద్దడి కారణంగా పుష్కరిణి శుభ్రత పనులను వాయిదా వేశారు. తాజాగా, ఈ ప్రక్రియను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధికారులు ప్రారంభించారు. 
 
నిల్వ ఉన్న మురుగునీటిని పైపుల ద్వారా నీటిశుద్ధి కేంద్రాలకు తరలించారు. నెల రోజులపాటు పుష్కరిణి శుద్ధి పనులు కొనసాగనున్నాయి. పుష్కరిణి అడుగుభాగం, మెట్లను పూర్తిగా శుభ్రం చేస్తారు. పాచి, చెత్తాచెదారాన్ని తొలగించి రంగులు వేస్తారు. అనంతరం 23 లక్షల గ్యాలెన్ల నీటితో పుష్కరిణిని నింపుతారు. 
 
ఈ పనులన్నీ పూర్తయిన అనంతరం వచ్చే నెల 6న పుష్కరిణిని పునఃప్రారంభిస్తారు. ఈ పనుల కారణంగా సాయంత్రం ఊరేగింపు సమయంలో ఉత్సవర్లకు సమర్పించే పుష్కరిణి హారతిని కూడా రద్దు చేశారు. పుష్కరిణి మరమ్మతులు పూర్తయ్యే వరకు భక్తులు స్నానపు గదుల్లోనే స్నానమాచరించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. 

అన్నీ చూడండి

బడికి వెళ్లడం ఇష్టం లేదు.. ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన బాలుడు

ఉగ్రవాదంపై అందరికీ ఒకే మాట ఉండాలి.. ఉగ్రవాదం వ్యూహాత్మక సంపద కాదు: ప్రధాని మోడీ

అమెరికాలో అమ్మాయి పెళ్లి.. సూర్యాపేటలో వీడియో కాల్ ద్వారా ఆశీర్వదించిన తల్లిదండ్రులు (video)

ప్రపంచం తడబడుతోంది.. కానీ భారత్ దూసుకెళుతోంది : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

చంబా జిల్లాలో ఆకస్మిక వరదలు - చున్నీతో బైకర్‌ను రక్షించిన నవ వధువు (Video)

అన్నీ చూడండి

krishna Jayanti 2026 worship: శ్రీ కృష్ణుని జయంతి రోజున ఈ ఐదు విషయాలు పాటిస్తే...?

01-09-2026 మంగళవారం రాశి ఫలితాలు... ఇతరుల మాటలను నమ్మి తొందరపడి..?

01-09-2026 నుంచి 30-09-2026 వరకు సెప్టెంబర్ మాస ఫలితాలు

కోడమూరు శ్రీ వేంకటేశ్వర స్వామికి తేళ్లను సమర్పిస్తున్న భక్తులు.. అలా చేస్తే?

బెజవాడ కనకదుర్గమ్మకు 119.5 గ్రాముల బంగారు జడ.. 15 రోజుల్లో వజ్ర కిరీటం..

తర్వాతి కథనం
Show comments