తితిదే గోశాలలో గోపూజ.. చిన్ని క్రిష్ణుడు చిద్విలాసం

బుధవారం, 12 ఆగస్టు 2020 (22:45 IST)
గోకులాష్టమి సంధర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఎస్వీ గోశాలలో బుధవారం గోపూజలు నిర్వహించారు. టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తొలుత శ్రీక్రిష్ణస్వామి ఆలయంలో స్వామివారికి నిర్వహించిన పూజలో పాల్గొన్నారు.
 
ఆ తరువాత అర్చకుల ఈఓ సింఘాల్‌కు వరిపట్టం కట్టి సాంప్రదాయబద్ధంగా గోపూజా మందిరానికి తీసుకెళ్ళారు. అలంకరించిన గోవుకు ఈఓ పూలమాలలు వేసి పసుపు, కుంకుమతో అలంకరించి అర్చకుల మంత్రోచ్ఛారణ మధ్య గోపూజ నిర్వహించారు. 
 
ఆ తరువాత గోవులకు దాణా పెట్టారు. కోవిడ్ -19 నేపథ్యంలో చాలా పరిమిత సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. అంతకుముందు శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో అభిషేకం, అర్చనలు జరిగాయి. తిరుమలలో కూడా శ్రీక్రిష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని టిటిడి ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో నిర్వహించారు. 
 
గోగర్భం డ్యాం చెంతగల ఉద్యానవనంలో కాళీయమర్థనుడు అయిన శ్రీక్రిష్ణునికి ఉదయం 10గంటల నుంచి పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, కుంకుమ, చందనం, పంచామృతాభిషేకాలు చేశారు. ఆ తరువాత ప్రసాద వితరణ జరిగింది. 

అన్నీ చూడండి

ట్రైనీ ఐపీఎస్ వేధింపుల కేసు విచారణ షీ టీమ్స్‌కు బదిలీ

NEET Issue: నీట్ పేపర్ లీక్ వ్యవహారం.. రంగంలోకి దిగిన వైసీపీ

విజయవాడలో దసరా నాటికి వందే భారత్ స్లీపర్ రైళ్లు

ఇరాన్ ట్రైలర్ మాత్రమే చూసింది.. ముందుంది అసలు సినిమా : డోనాల్డ్ ట్రంప్

విజయనగరం జిల్లాల్లోకి అడవి ఏనుగుల గుంపు.. భయం భయం

అన్నీ చూడండి

భక్తుల రద్దీ: గురువారం నాటి SSD టోకెన్లను రద్దు చేసిన టీటీడీ

32 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ - సింహాచలంలో భారీ ఏర్పాట్లు

22-07-2026 బుధవారం ఫలితాలు - మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది

విద్యా ప్రతిభకు, జ్ఞాపక శక్తికి హయగ్రీవుని మంత్రం

21-07-2026 మంగళవారం ఫలితాలు- తప్పుచేశామన్న భావం రానీయకండి

తర్వాతి కథనం
Show comments