శ్రీవారి భక్తులకు శుభవార్త - అర్జిత సేవల్లో భక్తులకు అనుమతి

గురువారం, 31 మార్చి 2022 (09:43 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)భక్తులకు మరో శుభవార్త చెప్పింది. కోవిడ్ మహమ్మారి కారణంగా నిలిపివేసిన అర్జిన సేవలను క్రమంగా పునరుద్ధరిస్తూ వస్తుంది. అలాగే, స్వామి వారి దర్శనంతో పాటు వివిధ సేవల్లో భక్తులు కూడా పాల్గొనేలా అనుమతి ఇస్తూ వస్తుంది. ఈ క్రమంలో ఇటీవల పునరుద్ధరించిన అర్జిత సేవా కార్యక్రమాల్లో భక్తులు కూడా పాల్గొనేందుకు అవకాశం కల్పించింది. 
 
శుక్రవారం నుంచి ఆర్జిత సేవలు ప్రారంభంకానున్న నేపథ్యంలో గురువారం ఉదయం 11 గంటల నుంచి 5 గంటల దాకా భక్తులు తమ పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. సాయంత్రం 6 గంటలకు ఎలక్ట్రానిక్‌ డిప్‌ ద్వారా భక్తులకు సేవను కేటాయిస్తారు. అడ్వాన్స్‌ బుకింగ్‌లో ఆర్జితసేవలు పొందిన భక్తులు రాకపోతే ఆ టికెట్లను కరెంట్‌ బుకింగ్‌ కోటాకు మళ్లించి రాత్రి 8.30 గంటలకు రెండవ డిప్‌ ద్వారా భక్తులకు కేటాయిస్తారు. వీరు రాత్రి 11 గంటలలోపు టికెట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 

అన్నీ చూడండి

నటుడు ప్రకాష్ రాజ్‌కు నాలుగు రాష్ట్రాల్లో ఓటు హక్కు - నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

ప్రకాశం జిల్లాలో దారుణ హత్య : వివాహేతర సంబంధమే కారణమని అనుమానం?

రైలులో భిక్షాటన చేస్తే ఇక జైలుశిక్షే... అపరాధం కూడా రూ.2 వేలకు పెంచారు

తమిళనాడులో మొదటి టోర్నడో.. తూత్తుకుడి పెను సుడిగాలి.. తీవ్ర నష్టం

జేఈఈ టాపర్ అయితే మాత్రం.. కేటీఆర్ భుజంపై చెయ్యేస్తారా? (video)

అన్నీ చూడండి

22-06-2026 సోమవారం ఫలితాలు - ఎవరినీ నిందించవద్దు

21-06-2026 - ఆదివారం మీ రాశి ఫలితాలు - రుణవిముక్తులవుతారు

సత్వ గుణం అంటే ఏమిటి? భగవద్గీతలో కృష్ణుడు చెప్పిందేమిటి?

21-06-2026 నుంచి 27-06-2026 వరకు వార ఫలితాలు - మీ మాటకు తిరుగుండదు

20-06-2026 శనివారం ఫలితాలు.. కొత్తవారిని నమ్మవద్దు..

తర్వాతి కథనం
Show comments