Webdunia - Bharat's app for daily news and videos

Install App

పసిపిల్లలా? పాలు తాగుతున్నారా? మాధవీలత ప్రశ్న

టి.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ సతీమణి పద్మినీ రెడ్డిపై బీజేపీ మహిళా నేత, సినీ నటి మాధవీలత ఫైర్ అయ్యారు.

Updated: శనివారం, 13 అక్టోబరు 2018 (11:33 IST)
టి.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ సతీమణి పద్మినీ రెడ్డిపై బీజేపీ మహిళా నేత, సినీ నటి మాధవీలత ఫైర్ అయ్యారు. శుక్రవారం ఉదయం బీజేపీలో చేరి.. తిరిగి సాయంత్రానికే అదే వేగంతో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరిపోవడంపై మాధవీలత మండిపడ్డారు. అయినా దేనికోసం ఈ నాటకం అంటూ ప్రశ్నించారు.


నమ్మి ఘనంగా స్వాగతం చెప్పడం బీజేపీ తప్పు కాదు. ఇలాంటి వాటిని కోవర్ట్ పాలిటిక్స్ అంటారంటూ మండిపడ్డారు.  ఇలాంటివి చేయడం కాంగ్రెస్‌కి మాత్రమే చెల్లుతుంది. ఇలాంటి ఉడతా జంప్స్‌కి బీజేపీ కదిలేది లేదు. మోదీ జీ వణికేది లేదంటూ మాధవీ లత ఫేస్‌బుక్‌లో తెలిపారు. 
 
పొద్దున్నే మోదీ జీ ఐడియాలజీ సూపర్.. సాయంత్రం అయ్యేసరికి పోయిందని మాధవీ లత ఎద్దేవా చేశారు. చేరబోయే ముందు ఆలోచన లేదా? పసిపిల్లలా? పాలు తాగుతున్నారా, ఏమీ తెలియకపోవడానికి. పద్మినీ రెడ్డి గారూ చాలా గొప్ప ప్లాన్ తో కోవర్ట్ పాలిటిక్స్ చెయ్యడానికి బీజేపీ లోకి అడుగువేశారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికలలో బీజేపీ ప్లాన్స్ తెలుసుకునేందుకు బీజేపీలో చేరి.. ఆ సాయంత్రానికే ద గ్రేట్ డియర్ హజ్బెండ్ ఉన్న పార్టీలో చేరి చెప్పేశారా? అంటూ మాధవీ లత ప్రశ్నించారు.

అన్నీ చూడండి

డెక్స్ట్రోకార్డియా ఉండే అరుదైన కథతో చిరంజీవి రాబోతోంది

Nani: నాని పోషించిన జడల్ పాత్ర ప్రమాదకరమైన గద్దలా ది ప్యారడైజ్ పోస్టర్

Ram: పాండిచ్చేరిలో RAPO23 కోసం పాట, యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ

కుమార్తెకు దుర్గా సప్తశతి మంత్రాలను నేర్పిస్తున్న ప్రియాంకా చోప్రా

Trinadha Rao: సెట్‌కి వెళ్లేటప్పుడు ఫుల్లుగా బిర్యానీ తినేసేవాడ్ని.: త్రినాథరావు నక్కిన

తర్వాతి కథనం
Show comments