సీఎం కేసీఆర్ కోలుకోవాలంటూ వారణాసిలో ఫ్లెక్సీలు

శనివారం, 12 మార్చి 2022 (10:06 IST)
తెరాస అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయన్ను హుటాహుటిన హైదరాబాద్ నగరంలోని యశోద ఆస్పత్రికి తరలించి వివిధ రకాలైన వైద్య పరీక్షలు చేశారు. ఇలాంటి పరీక్షల్లో కరోనరీ యాంజియోగ్రామ్ కూడా ఉంది. 
 
అయితే, కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారన్న వార్త, ఆయన్ను ఆస్పత్రిలో స్టెచ్చర్‌లో పడుకోబెట్టి వైద్యులు తీసుకెళుతున్న దృశ్యాలకు సంబంధించిన పోటీలు సోషల్ మీడియాలో చక్కర్లుకొట్టాయి. దీంతో వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. 
 
ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో కేసీఆర్ త్వరగా కోలుకోవాలంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. తెలంగాణాకు చెందిన సాయి అనే వీరాభిమాని ఈ ఫ్లెక్సీలను ఏర్పాటుచేశారు. శుక్రవారం సాయంత్రం గంగానదిలో దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించి నదిలోని బోట్లలో కేసీఆర్ ఫ్లెక్సీలను కట్టినట్టు చెప్పారు. 
 
ఫ్లెక్సీలపై దేశ్ కా నేత అంటూ పెద్ద అక్షరాలతో రాసి కేసీఆర్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. అలాగే, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత ఫోటోలను కూడా ముద్రించారు. ఈ సందర్భంగా సాయి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్‌కు కాశీ విశ్వనాథుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తూ ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 

అన్నీ చూడండి

పెళ్లి చేసుకునేందుకు సరైన వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నా : శ్రీముఖి

Kajal Aggarwal: సాక్షుల బోనులో పురుగుమందు సిలిండర్ తో లాయర్ కాజల్ అగర్వాల్..ది ఇండియా స్టోరీ

Singeetham: 40 ఏళ్ల కలని సక్సెస్ చేసిన ఘనత నాగ్ అశ్విన్ గారిదే : సింగీతం శ్రీనివాసరావు

Natti Kumar: పర్సంటేజ్ సబ్ కమిటీ నుంచి సురేష్ బాబు, దిల్ రాజు తప్పుకోవాలి : నట్టికుమార్

Arnold Vosloo: రణబాలి సినిమాలో ది మమ్మీ ఫేమ్ ఆర్నాల్డ్ వోస్లూ లుక్

తర్వాతి కథనం
Show comments