కరోనా తాండవం, కోడిగుడ్లు అమ్ముకుంటున్న ప్రైవేట్ ఉపాధ్యాయుడు

బుధవారం, 21 అక్టోబరు 2020 (15:55 IST)
ఆయన ఓ ప్రైవేట్ ఉపాధ్యాయుడు, 15 ఏళ్ల పాటు ఎంతోమంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పారు. చేతిలో ఉన్న ఐదు డిగ్రీలతో గతంలో కుటుంబ పోషణను కొనసాగించాడు. కరోనా విజృంభణతో అన్ని విద్యా సంస్థలు మూతపడ్డాయి. దీంతో ఉపాధి కరువైంది. చేతిలో ఐదు డిగ్రీల ఉన్నా నోటిలో ఐదు వేళ్లు పోలేని దుస్థితి ఏర్పడింది.
 
కరోనాతో ప్రైవేట్ ఉపాధ్యాయుల అవస్థలు అంతాఇంతా కాదు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేటకు చెందిన హైదర్‌ఖాన్ ఎంఏ, బిఈడీ, ఇంగ్లీష్‌లో పీజీ కూడా చేశారు. ఆ తర్వాత పలు పాఠశాలల్లో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించి అందరి ప్రరశంసలు అందుకున్నారు.
 
కాగా ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా ప్రైవేట్ టీచర్లపై పడింది. తనతో పనులు చేయించుకున్న విద్యాసంస్థలు చేతులెత్తేసాయ్. దీంతో ఉపాధి కరవై పనిలేక సొంత ఊరికెళ్లి కోడిగుడ్ల వ్యాపారం మొదలు పెట్టారు. ఇలాంటి పరిస్థితులు వస్తాయని ఊహంచలేకపోయారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

అన్నీ చూడండి

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

తర్వాతి కథనం
Show comments