తెలంగాణలో ఒక్కసారిగా భారీగా తగ్గిన కరోనా కేసులు

ఆదివారం, 9 మే 2021 (13:11 IST)
తెలంగాణా రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఒక్కసారిగా భారీగా తగ్గిపోయాయి. వార రోజుల క్రితం వరకు దాదాపు 8 వేలకు నమోదైన కేసులు ఇప్పుడు 5 వేలకు చేరాయి. తాజాగా నమోదైన కేసులు 5,186 కాగా, 38 మరణాలు సంభవించాయి. 24 గంటల్లో 7,994 మంది చికిత్స పొందుతూ డిశ్చార్జ్‌ అయ్యారు. 
 
మరోవైపు, తెలంగాణ వైద్యారోగ్య శాఖ మళ్లీ సాయంత్రం పూట కరోనా బులెటిన్‌ విడుదల చేయడం ప్రారంభించింది. శనివారం వరకు ఉదయం విడుదల చేస్తుండగా తాజాగా సాయంత్రానికి మార్చారు. తాజాగా శనివారం విడుదల చేసిన బులెటిన్‌లో ఒక్క రోజులో 69,148 మందికి కరోనా పరీక్షలు చేశారు. ఇప్పటివరకు చేసిన కరోనా పరీక్షలు 1,35,57,646. కరోనా నుంచి కోలుకున్నవారు.
 
మొత్తం 4,21,219 మంది ఉండగా, రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 68,462. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా కేసులు 4,92,385. మొత్తం మృతుల సంఖ్య 2,704. అత్యధికంగా హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో కేసులు నమోదవుతున్నాయి. అత్యల్పంగా కొమురం భీం ఆసిఫాబాద్‌, నారాయణపేట జిల్లాలో కేసులు వెలుగులోకి వస్తున్నాయి. 

అన్నీ చూడండి

Ruthvik: అబ్బాయిగా, అమ్మాయిగానూ నటించా, ఆ సినిమా చూసి నాట్యం నేర్చుకున్నా : రుత్విక్

Kiran Abbavaram: ఒడిదొడుకులు చూశా. ఇలాంటి మంచి సినిమాల కోసమే నిత్యం ప్రయత్నిస్తున్నా: కిరణ్ అబ్బవరం

Thalapathy: ముగిసిన దళపతి విజయ్ జ‌న నాయ‌గ‌న్‌ నిరీక్ష‌ణ‌.. జూలై 23న గ్రాండ్ రిలీజ్

నాగవంశీ ఆవిష్కరించిన అనకాపల్లి’ నుంచి ‘ఎలగే పిల్ల’ రొమాంటిక్ సాంగ్

వినాయక్ గారికి, V N ఆదిత్య ప్రారంభించిన కరుణామయ చిత్రం

తర్వాతి కథనం
Show comments