Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.300కే డయాలసిస్ .. ఎక్కడ?

Written By ఠాగూర్
Updated: మంగళవారం, 9 నవంబరు 2021 (10:36 IST)
సాధారణంగా కిడ్నీ రోగులకు చేసే డయాలసిస్ చికిత్సకు వేలాది రూపాయలు ఖర్చు అవుతుంది. ముఖ్యంగా, ప్రైవేట్ ఆస్పత్రిల్లో ఈ వైద్యానికి భారీగా వసూలు చేస్తుంటారు. ఈ మొత్తాన్ని పేదలు భరించలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎంతోమంది అభాగ్యులను భగవాన్‌ మహావీర్‌ జైన్‌ రిలీఫ్‌ ఫౌండేషన్‌ ట్రస్టు(బీఎంజేఆర్‌ఎఫ్‌టీ) ఆదుకుంటోంది. 
 
రూ.వేలు అయ్యే డయాలసిస్‌ను రూ.300కే అందిస్తూ ఎంతోమంది ప్రాణాలను కాపాడుతోంది. సోమవారం కింగ్‌కోఠి ఆసుపత్రిలోని సెంటర్‌లో ట్రస్టీలతో కలిసి ఆ ట్రస్టు ఛైర్మన్‌ పి.సి.పరాక్‌ మీడియాతో మాట్లాడారు. 
 
కింగ్‌కోఠి జిల్లా ఆసుపత్రి ప్రాంగణంలో 24 డయాలసిస్‌ యంత్రాలతో కేంద్రాన్ని ప్రారంభించామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పది లక్షల డయాలసిస్‌లు పూర్తి చేసిన సందర్భంగా ఈనెల 13న సికింద్రాబాద్‌ ఇంపీరియల్‌ గార్డెన్స్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు.

అన్నీ చూడండి

హైదరాబాద్‌ను ఉర్రూతలూగించనున్న రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్

Rahul Sipligunj Case: రాహుల్ సిప్లగింజ్ కేసు.. ఒకవేళ ఆమె రాకపోతే...?

దేవ కట్టా సమర్పణలో రా, రస్టిక్, రొమాంటిక్ కామెడీ చిత్రం జో జో’

నేను రెడీ నుంచి హవీష్, కావ్య థాపర్ పై మస్తుగుందిరా యవ్వారం సాంగ్

అమీర్ లోగ్ చాలా రియలిస్టిక్‌గా, రా గా అనిపిస్తోంది : సాయి మార్తాండ్

తర్వాతి కథనం
Show comments