Webdunia - Bharat's app for daily news and videos

Install App

లారీకి పట్టకప్పి ఘాతుకానికి పాల్పడ్డారు... సి.సి.కెమెరాలో లారీ

Written By జె
Updated: బుధవారం, 11 డిశెంబరు 2019 (21:42 IST)
దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితులు నలుగురిని ఎన్ కౌంటర్ చేసినా సరే ఆ యువతి పడిన బాధ అందరినీ కలచివేస్తోంది. పోలీసుల విచారణలో ఆ యువకులు చెప్పిన మాటలు అలాంటివి. మొదట్లో నలుగురు కలిసి సామూహిక అత్యాచారం చేశారు. ఆ తరువాత లారీలోను అత్యాచారం చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడించారు.
 
గంటన్నరపాటు అతి దారుణంగా దిశకు నరకం చూపించిన ఆ మృగాళ్ళు ఆ తరువాత లారీలోను అత్యాచారానికి పాల్పడ్డారు. దిశ అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవడంతో లారీలో అత్యాచారం జరిగిన సమయంలో పట్ట కప్పినట్లు పోలీసులు గుర్తించారు. ఆ సి.సి. ఫుటేజ్‌ను పోలీసులు తాజాగా స్వాధీనం చేసుకున్నారు. లారీ కదిలినప్పటి నుంచే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
 
అయితే పట్ట కప్పి ఉండడం.. పూర్తిగా చీకటి కావడంతో ఎవరూ కూడా ఈ మృగాళ్ళ అకృత్యాలను గుర్తించలేకపోయారు. దీంతో దిశ చివరకు ప్రాణాలను కోల్పోయింది. నిందితులను ఎన్ కౌంటర్ చేసినా మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాల్లో మాత్రం ఈ ఘటనపై ఇప్పటికీ ఆగ్రహావేశాలు ఏమాత్రం తగ్గడంలేదు. ఒంటరిగా ఉన్న ఒక యువతిపై ఇంత దారుణానికి మృగాళ్ళు పాల్పడటం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది.

అన్నీ చూడండి

Rashmika Mandanna: ఆనంద్ సినిమా గురించే ఆలోచిస్తాడు, కష్టపడుతుంటాడు, ఎపిక్ చూస్తా : రష్మిక మందన్నా

Chandra Siddharth : బ్రయిన్ మ్యాపింగ్.. కథాంశంగా చంద్ర సిద్ధార్థ్ చిత్రం ‘ఈ పాట కోరినవారు.....

సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ చిత్రం ధర్మన్ రెండవ షెడ్యూల్ పూర్తి

Ananya Nagalla: రెండు భిన్నమైన జోనర్లతో అనన్య నాగళ్ల చిత్రం లీసా సిద్ధం

వేణు ఊడుగుల సమర్పణ లో అడ్వెంచర్ మూవీగా చంద్రయాన్

తర్వాతి కథనం
Show comments