హైదరాబాదులో భారీగా డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు..ఎందుకో తెలుసా?

గురువారం, 21 మే 2020 (06:27 IST)
లాక్ డౌన్ ప్రారంభం అయిన తరువాత హైదరాబాదు నగరంలో డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలను ఆపేసిన పోలీసులు, మద్యం విక్రయాలు ప్రారంభమై రెండు వారాలు గడుస్తున్నా, ఇంతవరకూ వాటిని నిర్వహించలేదు.

సాయంత్రం 6 గంటలకు మద్యం షాపులను మూసి వేస్తుండటం, 7 గంటల నుంచి కర్ఫ్యూ అమల్లోకి వస్తుండటమే దీనికి కారణం.

ఇక మొన్నటి నుంచి భారీ స్థాయిలో లాక్ డౌన్ సడలింపులు అమలులోకి రావడంతో అనుమానితులకు డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి.

దీంతో పుత్లిబౌలి చౌరస్తాలో బోల్తా కొట్టిన ఆటో డ్రైవర్ కు పరీక్షలు నిర్వహించగా, 187 బీఏసీ కౌంట్ వచ్చింది. దీంతో వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక, మాస్క్ లు లేకుండా బయటకు వచ్చిన వారిపైనా పోలీసులు కొరడా ఝళిపించారు.

మాస్క్ లేనివారిపై రూ. 1000 జరిమానా విధిస్తున్నామని, మంగళవారం నాడు జంట నగరాల పరిధిలో 395 మందిపై జరిమానా విధించామని అధికారులు తెలిపారు.

అన్నీ చూడండి

NTR: కార్తికేయ పౌరాణిక ఇతిహాసం కథతో ఎన్టీఆర్, త్రివిక్రమ్ చిత్రం

నా సిక్స్ ప్యాక్ ఇది.. మళ్లీ కలుద్దాం.. సమంత బేబీ బంప్ ఫోటో వైరల్

EVV satyanarayana: అల్లరి నరేష్ నటించిన ఆరుగురు పతివ్రతలు రీ-రిలీజ్ కాబోతోంది

తమిళనాట మరో జయమ్మగా త్రిష.. లారెన్స్ అలా చెప్పడంతో త్రిషకు డిప్యూటీ సీఎం పోస్ట్?

Vijay Deverakonda: హైదరాబాద్ వాలీబాల్ ప్లేయర్స్ ను సపోర్ట్ చేసిన విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments