Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం కేసీఆర్‌పై మాటల తూటాలు పేల్చిన ఈటల.... ఎం జరిగిందో వెల్లడిస్తా...

Written By ఠాగూర్
Updated: శనివారం, 10 జులై 2021 (14:40 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని ఆ పార్టీ మాజీ నేత, బీజేపీ నేత ఈటల రాజేందర్ మరోమారు మాటల తూటాలు పేల్చారు. ఎన్నికలు వచ్చినపుడు ఏం జరిగిందో బయటపెడతానంటూ హెచ్చరికలు చేశారు. 
 
త్వరలోనే తాను రాజీనామా చేసిన హుజురాబాద్ స్థానానికి ఉప ఎన్నికలు జరుగనున్నయి. ఈ పరిస్థితుల్లో ఈటల రాజేందర్ మరోసారి సీఎం కేసీఆర్‌పై మాటల తూటాలను పేల్చారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటనలో ఆయన.. కేసీఆర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. 
 
కంచె చేను మేసిన చందంగా టీఆర్ఎస్ తీరు ఉందని విమర్శించారు. తనకు వ్యతిరేకంగా.. తనను ఓడించడానికి కాంగ్రెస్ నాయకుడికి డబ్బులు ఇచ్చిన దుర్మార్గపు చరిత్ర వాళ్లది అని పేర్కొన్నారు. 
 
'పెన్షన్లు.. రేషన్లు.. ఇవ్వలేని మంత్రిపదవి ఎందుకని అడిగానని.. తప్పా అది ఏమైనా? గుట్టలు.. కంచెలు.. భూస్వాములు.. వ్యాపారులకు రైతుబంధు ఇవ్వొద్దని చెప్పా. డబ్బులు ఎక్కువ ఉంటే… దళితులకు, బడుగులకు, నిరుద్యోగులకు లక్ష రూపాయల చొప్పున ఇస్తే బాగుంటుందని సూచించా' అని ఈటల వ్యాఖ్యానించారు. 

అన్నీ చూడండి

ఓటరు కార్డు చిరునామా మార్చుకోమంటుంటే ప్రభుత్వాన్నే మార్చేస్తానంటారేంటి ప్రకాష్ రాజ్?!! వీడియో

హైదరాబాద్‌ను ఉర్రూతలూగించనున్న రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్

Rahul Sipligunj Case: రాహుల్ సిప్లగింజ్ కేసు.. ఒకవేళ ఆమె రాకపోతే...?

దేవ కట్టా సమర్పణలో రా, రస్టిక్, రొమాంటిక్ కామెడీ చిత్రం జో జో’

నేను రెడీ నుంచి హవీష్, కావ్య థాపర్ పై మస్తుగుందిరా యవ్వారం సాంగ్

తర్వాతి కథనం
Show comments