ఈటల పాదయాత్ర : 23 రోజులు 270 కిలోమీటర్లు

సోమవారం, 19 జులై 2021 (11:13 IST)
ఇటీవల కాషాయం కండువా కప్పుకున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ పాదయాత్ర చేపట్టనున్నారు. ఆయన సొంత నియోజక వర్గం హుజురాబాద్ లో జరగబోతున్న ఈ పాదయాత్ర  క‌మ‌లాపూర్ మండ‌లంలోని బ‌త్తినివానిప‌ల్లి నుంచి ప్రారంభిస్తున్నారు. 
 
బ‌త్తినివానిప‌ల్లిలోని ఆంజ‌నేయుని దేవ‌స్థానంలో సోమవారం ఉద‌యం 9:30 గంట‌ల‌కు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించిన ఆయన శ‌నిగ‌రం, మాద‌న్న‌పేట‌, గునిప‌ర్తి, శ్రీరాముల‌పేట‌, అంబ‌ల గ్రామాల్లో పాద‌యాత్ర చేయ‌నున్నారు. రాత్రికి అంబ‌ల గ్రామంలో బ‌స చేయనున్నారు. మొత్తం 23 రోజుల పాటు 270 కిలోమీట‌ర్ల మేర ఈ పాద‌యాత్ర జరగనుంది.
 
కాగా, ఇటీవల తెరాసకు రాజీనామా చేసిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరారు. దీంతో ఆయన ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన హుజురాబాద్ స్థానానికి జరిగే ఉపఎన్నికలను అటు తెరాస, ఇటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా, ఈ ఉప ఎన్నిక ఈటల రాజేందర్‌కు జీవన్మరణ సమస్యగా మారింది. 

అన్నీ చూడండి

Priyanka Chopra: వారణాసి నుండి ప్రియాంక చోప్రా కొత్త లుక్ పోస్ట్ చేసిన రాజమౌళి

Sumanth: వారాహి అమ్మవారి చుట్టూ సాగే కథతో మహేంద్రగిరి వారాహి సిద్ధం

Ameer Log: అమీర్ లోగ్ నుంచి స్ట్రీట్ ఆంథమ్‌లా సాగే సీదా హెలికాప్టర్ షాట్ పాట

దురంధర్, ది రాజా సాబ్ సినిమాలతో ఓటీటీలో పోటీలో నెగ్గిన శ్రీ నందు అగ్లీ స్టోరీ

అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో పళ్ళబురుసు చిత్రం ప్రకటన

తర్వాతి కథనం
Show comments