Webdunia - Bharat's app for daily news and videos

Install App

మత్తు ఇచ్చి తల్లీకూతుళ్లపై సామూహిక అత్యాచారం... ఎక్కడ?

Written By ఎం
Updated: బుధవారం, 22 జులై 2020 (17:15 IST)
మాయమాటలు చెప్పి తల్లీకూతుళ్లకు మత్తు మందిచ్చారు. ఆనక వరుస బెట్టి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ముగ్గురు స్నేహితులు. వివరాల్లోకి వెళితే... హైదరాబాద్‌ సందయ్య నగర్‌లోని ఓ ఇంట్లో అద్దెకుండే మహిళ, ఆమె కుమార్తెపై ఇంటి యజమాని, ఆయన ఇద్దరు స్నేహితులు అత్యాచారానికి పాల్పడ్డారు.

ఈ ఘటనపై బాధితురాలు చందానగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఓ వివాహిత(35) తన కూతురు(15), కుమారుడితో కలిసి ఓ ఇంట్లో నివాసముంటోంది.

ఇంటి యజమాని తమకు ఇచ్చిన ఆహార పదార్థాల్లో మత్తుమందు కలిపి ఇచ్చాడని, అవి తిని మత్తులోకి జారుకున్నాక తనతో పాటు తన కూతురిపైనా ముగ్గురూ కలిసి అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలితో పాటు కూతురిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అన్నీ చూడండి

దుల్కర్ సల్మాన్.. ఐ యామ్ గేమ్ నుంచి ఎవరే నువ్వే గీతం విడుదల

Shyam Prasad Reddy: అగధ లో కామాక్షి ని చూస్తే అరుంధతి లో అనుష్క ను గుర్తుచేసింది : శ్యాం ప్రసాద్ రెడ్డి

రాకేష్ వర్రే, మధుమిత సర్కార్ పై మాయలేడి చెంగు చెంగున దూకెరా.. సాంగ్

జ్యోతి పూర్వజ్ కిల్లర్ చిత్రం తెలుగు, తమిళ సహా పలు దేశాల్లో విడుదల.

Manchu Manoj :ఇండస్ట్రీకి కులం, గోత్రం లేదు : గజ టీజర్ లాంచ్ లో మంచు మనోజ్

తర్వాతి కథనం
Show comments