Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్- 35 కనీస మార్కులు వేసి పాస్ చేస్తారా?

Written By సెల్వి
Updated: సోమవారం, 20 డిశెంబరు 2021 (16:38 IST)
తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు గుడ్ న్యూస్. కరోనా లాంటి కాలంలో జరిగిన పరీక్షల్లో 51 శాతం మంది విద్యార్థులు ఫెయిల్ కావడంపై దుమారం రేగింది. రాష్ట్ర వ్యాప్తంగా పదుల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం ఇప్పుడు రాష్ట్రంలో ఆందోళన కలిగిస్తోంది.
 
ఈ నేపథ్యంలో.. ఇంటర్‌ ఫస్టియర్‌ ఫలితాలపై తెలంగాణ ప్రభుత్వం పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. విద్యార్థుల ఆత్మహత్యలు, విద్యార్థి సంఘాల వ్యతిరేకత నేపథ్యంలో.. విద్యార్థులు అందరినీ పాస్‌ చేసే దిశగా అడుగులు వేస్తోంది.
 
ఫెయిల్‌ అయిన విద్యార్థులకు.. 35 కనీస మార్కులు వేసే విషయాన్ని పరిశీలిస్తోంది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో ప్రకటన చేసే అవకాశం ఉంది. ఫెయిల్‌ విద్యార్థుల్లో ఎక్కువ మంది 5నుంచి 10 శాతం మార్కులు మాత్రమే సాధించారు. 
 
ఆన్‌లైన్‌ క్లాస్‌ ద్వారా విద్యార్థులకు సరైన బోధన జరగకపోవడమే దీనికి కారణంగా భావిస్తున్నారు. 10వ తరగతి పరీక్షలు రద్దు చేసి విద్యార్థులు అందరినీ ఇంటర్‌కు ప్రమోట్‌ చేయడం మరో కారణం అయ్యి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
 
దీంతో ప్రస్తుతం ఫెయిల్‌ అయిన విద్యార్థులు అందరినీ.. కనీస మార్కులతో పాస్‌ చేయడం తప్ప.. మరో మార్గం లేదనే అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది.  

అన్నీ చూడండి

Mohanlal: మోహన్‌లాల్ - విష్ణు మోహన్ మూవీ టైటిల్ ఆపరేషన్ గంగా

అనూప్ రూబెన్స్ ముగ్గురు కోతులు చిత్రం సాంగ్ రిలీజ్

Athreyapuram Brothers,: ఆత్రేయపురం బ్రదర్స్ చిత్రీకరణ పూర్తి

NBK111 టైటిల్ దాదా? విడుదల తేదీ అప్ డేట్ రాబోతోంది

విశ్వక్ సేన్ పొలిటికల్ యాక్షన్ డ్రామా లెగసీ విడుదల తేదీ ఖరారు

తర్వాతి కథనం
Show comments